ఆదోని అర్బన్: వివాహేతర సంబంధానికి అడొస్తున్నాడన్న
నెపంతో భర్తను భార్య గొంతు నులిమి చంపేసిన ఘటన కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని అమరావతినగర్లో శనివారం వెలుగుచూసింది. ఆదోని వన్డేన్ సీఐ చంద్రశేఖర్ తెలిపిన వివరాల మేరకు.. అమరావతి నగర్కు చెందిన నల్లబోతుల మహేష్(28), బళ్లారి ఈరమ్మ ప్రేమ వివాహం చేసుకున్నారు. వారికి కుమారుడు, కుమార్తె ఉన్నారు.
ఈరమ్మ వివాహేతర సంబంధం కొనసాగిస్తోందని తెలుసుకుని మహేష్ మద్యం సేవించి గొడవ పడేవాడు. దీంతో వివాహేతర సంబంధానికి అడ్డస్తున్నాడని భావించిన ఈరమ్మ పొలానికి తీసుకెళ్లి మహేష్ గొంతు నులిమి హత్య చేసినట్టు సీఐ తెలిపారు. మృతుడు అక్క చిట్టెమ్మ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు.
Also read
- Astrology: జూన్లో గ్రహాల మహా సంచారం.. ఈ 5 రాశుల వారికి ఊహించని అదృష్టం, ధనలాభం ఖాయం!
- Dreams: బ్రహ్మ ముహూర్తంలో ఇలాంటి కలలు వస్తున్నాయా? అంతా శుభమే!
- గురు గ్రహ దోష నివారణకు శక్తివంతమైన దత్తాత్రేయ తిలకం- ఇలా ధరిస్తే పట్టిందల్లా బంగారమే!
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- భర్త కళ్ల ముందే, ఆ పని చేసిన దుండగులు, హైదరాబాద్ లో దారుణమైన ఘటన




