ఆదోని అర్బన్: వివాహేతర సంబంధానికి అడొస్తున్నాడన్న
నెపంతో భర్తను భార్య గొంతు నులిమి చంపేసిన ఘటన కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని అమరావతినగర్లో శనివారం వెలుగుచూసింది. ఆదోని వన్డేన్ సీఐ చంద్రశేఖర్ తెలిపిన వివరాల మేరకు.. అమరావతి నగర్కు చెందిన నల్లబోతుల మహేష్(28), బళ్లారి ఈరమ్మ ప్రేమ వివాహం చేసుకున్నారు. వారికి కుమారుడు, కుమార్తె ఉన్నారు.
ఈరమ్మ వివాహేతర సంబంధం కొనసాగిస్తోందని తెలుసుకుని మహేష్ మద్యం సేవించి గొడవ పడేవాడు. దీంతో వివాహేతర సంబంధానికి అడ్డస్తున్నాడని భావించిన ఈరమ్మ పొలానికి తీసుకెళ్లి మహేష్ గొంతు నులిమి హత్య చేసినట్టు సీఐ తెలిపారు. మృతుడు అక్క చిట్టెమ్మ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు.
Also read
- కొనసాగుతున్న దళితులపై దాడుల పరంపర….ఐ.యఫ్.టి.యు
- బస్టాండ్ లో దారుణం.. ప్రేమ నిరాకరించిందని బంధువు దాడి!
- కన్న కొడుకును గొడ్డలితో నరికి చంపిన తల్లి.. ఎందుకో తెలుసా..?
- Hyderabad: ఓల్డ్సిటీ ప్రైవేట్ స్కూల్లో కలకలం.. కల్మా చదవాలని హిందూ విద్యార్థికి హోమ్ వర్క్..
- బాలికపై ముగ్గురు ఆటో డైవర్ల పైశాచికం! ప్రేమ పేరుతో ఒకడు, వీడియోలు ఉన్నాయంటూ ఇద్దరు..





