హిందూ సాంప్రదాయంలో వివాహ బంధానికి, భార్యాభర్తల అనుబంధానికి ఎంతో పవిత్రమైన స్థానం ఉంది. పెళ్లయిన ప్రతి మహిళా తన భర్త నూరేళ్ల పాటు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, తాను దీర్ఘ సుమంగళిగా ఉండాలని కోరుకుంటుంది. అయితే, సాధారణంగా సమాజంలో భార్యల కంటే భర్తలే ముందుగా మరణించడం మనం ఎక్కువగా చూస్తుంటాం. దీని వెనుక కేవలం వయస్సు తేడాలు లేదా ఆరోగ్య సమస్యలు మాత్రమే కాకుండా.. కొన్ని ఆధ్యాత్మిక మరియు పౌరాణిక కారణాలు కూడా ఉన్నాయని మన గ్రంథాలు చెబుతున్నాయి. ముఖ్యంగా
గరుడ పురాణం వాస్తు శాస్త్ర నివేదికల ప్రకారం.. ఇంట్లో ఉండే సానుకూల లేదా ప్రతికూల వాతావరణం, అలాగే భార్యాభర్తల ప్రవర్తన వారి ఆయుష్షుపై నేరుగా ప్రభావం చూపుతాయి. మానవ జీవితం, మరణం గురించి వివరించే ‘గరుడ పురాణం’ లో దీని గురించి కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు వెల్లడయ్యాయి. భర్త ఆయుష్షు క్షీణించడానికి భార్యలు చేసే కొన్ని చిన్న చిన్న పొరపాట్లు ఎలా కారణమవుతాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
1. పవిత్రమైన రోజుల్లో ఉపవాసం పాటించకపోవడం: హిందూ ధర్మంలో భార్య చేసే వ్రతాలు, ఉపవాసాలు భర్త రక్షణ కవచంగా మారుతాయని నమ్ముతారు. గరుడ పురాణం ప్రకారం.. భార్యలు కార్తీక పూర్ణిమ, ఏకాదశి, వట సావిత్రి లేదా వరలక్ష్మీ వ్రతం వంటి పవిత్రమైన రోజుల్లో నిష్టగా ఉండకుండా, నియమాలను ఉల్లంఘిస్తే.. దాని ప్రతికూల ప్రభావం భర్త ఆరోగ్యం మరియు ఆయుష్షుపై పడుతుందని చెబుతారు.
2. ఉదయాన్నే ఆలస్యంగా నిద్రలేవడం: ఏ ఇంట్లోనైతే గృహిణి (భార్య) సూర్యోదయానికి ముందే లేవకుండా, చాలా ఆలస్యంగా నిద్రలేస్తుందో.. ఆ ఇంట్లో లక్ష్మీదేవి నిలవదని, నెగటివ్ ఎనర్జీ పెరుగుతుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఈ ప్రతికూల శక్తులు ఇంటి యజమాని అయిన భర్త మానసిక ప్రశాంతతను దెబ్బతీసి, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలకు కారణమవుతాయి.
3. భోజన నియమాలలో పొరపాట్లు: మన పెద్దల కాలం నుండి ఒక ఆచారం ఉంది.. ఇంట్లో భర్త భోజనం చేసిన తర్వాతే భార్య తినాలి. కానీ గరుడ పురాణం ప్రకారం, భర్త కంటే ముందే భార్య దొంగచాటుగా లేదా కావాలనే ప్రతిరోజూ ఆహారం తినేయడం, లేదా భర్త ఆకలితో ఉన్నప్పుడు అతన్ని పట్టించుకోకపోవడం వల్ల భర్త ఆయుర్దాయం తగ్గుతుందని నమ్ముతారు.
4. నిరంతరం గొడవలు మరియు అగౌరవపరచడం: భార్యాభర్తల మధ్య చిన్నచిన్న విభేదాలు సహజమే. కానీ, భార్య నిరంతరం భర్తను మానసికంగా వేధించడం, ఇతరుల ముందు తక్కువ చేసి మాట్లాడటం లేదా అగౌరవపరచడం వల్ల భర్త తీవ్రమైన ఒత్తిడికి లోనవుతాడు. ఈ మానసిక కుంగుబాటు పురుషులలో గుండె జబ్బులు మరియు ఇతర ప్రాణాంతక వ్యాధులకు దారితీస్తుంది.
5. సంధ్యా సమయంలో నిద్రపోవడం: సూర్యాస్తమయం అయ్యే సమయంలో (సాయంత్రం వేళ) ఇంట్లో నిద్రపోవడం లేదా భార్యాభర్తలు గొడవపడటం అస్సలు మంచిది కాదు. ఈ సమయంలో దేవుడి గదిలో దీపం వెలిగించి ప్రశాంతంగా ఉండాలి. అలా కాకుండా సంధ్యా సమయంలో నిద్రపోతే ఆయుష్షు క్షీణిస్తుందని పురాణాలు హెచ్చరిస్తున్నాయి.
కాబట్టి, కుటుంబంలో సంతోషం వెల్లివిరియాలన్నా, భర్త ఆయుష్షు నూరేళ్లు సాగాలన్నా భార్యాభర్తలు ఇద్దరూ ఒకరినొకరు గౌరవించుకుంటూ, ఇంట్లో ప్రశాంతమైన వాతావరణాన్ని కాపాడుకోవడం ఎంతో ముఖ్యం.
