ఇబ్రహీంపట్నం, : ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకోవడానికి ధాన్యం కొనుగోలు కేంద్రం వద్దకు వచ్చిన రైతు వడదెబ్బకు గురై ధాన్యం కుప్పపైనే ప్రాణాలు వదిలారు. ఈ హృదయవిదారక ఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం రాయపోల్లో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గౌరయ్య(60) అర ఎకరం సొంత పొలంతో పాటు మరికొంత కౌలుకు తీసుకుని వరి సాగు చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రానికి మూడు రోజుల కిందట వడ్లను తీసుకొచ్చారు. అక్కడే రోజూ ఆరబెడుతున్నారు. ఆదివారం సాయంత్రం వర్షం వస్తుందేమోనని ఆరబెట్టిన వడ్లను కుప్పగా చేస్తుండగా వడదెబ్బకు గురై మృతి చెందారు. ఆయనకు భార్య వెంకటమ్మ, ఇద్దరు కుమారులు ఉన్నారు. గౌరయ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని భారాస జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు.
Also read
- కొడుకుతో కలిసి.. ప్రియుడిని హతమార్చిన మహిళ
- ధాన్యం కుప్పపైనే ప్రాణాలొదిలిన అన్నదాత
- ఇంటి తాళాలు పగలగొట్టి సినిపక్కీలో భారీ చోరీ.. 12 రోజుల తర్వాత ఎట్టకేలకు చిక్కిన అన్నదమ్ములు!
- నిశ్చితార్థమయ్యింది.. కానీ ..!
- అధిక మాసం రహస్యాలు.. జ్యేష్ఠ మాసంలో తప్పక చేయాల్సిన పూజలు, నియమాలు..





