ఇబ్రహీంపట్నం, : ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకోవడానికి ధాన్యం కొనుగోలు కేంద్రం వద్దకు వచ్చిన రైతు వడదెబ్బకు గురై ధాన్యం కుప్పపైనే ప్రాణాలు వదిలారు. ఈ హృదయవిదారక ఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం రాయపోల్లో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గౌరయ్య(60) అర ఎకరం సొంత పొలంతో పాటు మరికొంత కౌలుకు తీసుకుని వరి సాగు చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రానికి మూడు రోజుల కిందట వడ్లను తీసుకొచ్చారు. అక్కడే రోజూ ఆరబెడుతున్నారు. ఆదివారం సాయంత్రం వర్షం వస్తుందేమోనని ఆరబెట్టిన వడ్లను కుప్పగా చేస్తుండగా వడదెబ్బకు గురై మృతి చెందారు. ఆయనకు భార్య వెంకటమ్మ, ఇద్దరు కుమారులు ఉన్నారు. గౌరయ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని భారాస జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు.
Also read
- ‘ఎందుకు చంపావ్ నాన్నా..’ ముగ్గురు కూతుళ్లను చంపి ఆపై తండ్రి ఆత్మహత్య
- మీకు చేతులెలా వచ్చాయి..? అమ్మ ఒడిలో కాదు.. ముళ్లపొదల్లో కనిపించిన పసి ప్రాణం!
- దొంగలు బాబోయ్ దొంగలు… దడ పుట్టిస్తున్న థార్ దొంగలు…
- బాలింత చితాభస్మంలో కత్తెర.. అంత్యక్రియలు పూర్తయ్యాక బూడిదలో గుర్తింపు
- రాడ్డుతో తలపై కొట్టి.. చెరువులో పడేసి..





