SGSTV NEWS online
Andhra PradeshCrime

లోపల ముగ్గురు మహిళలు.. ఓ పురుషుడు.. కట్‌చేస్తే, పోలీసుల ఎంట్రీతో..



గుంటూరు నగరంలో మసాజ్ సెంటర్ల ముసుగులో వ్యభిచారం వెలుగులోకి వచ్చింది. జిల్లా ఎస్పీ ఆదేశాలతో టాస్క్ ఫోర్స్ పోలీసులు లక్ష్మీపురం, ఇన్నర్ రింగ్ రోడ్డులోని స్పా సెంటర్లపై మెరుపు దాడులు చేశారు. ఈ దాడుల్లో పలువురు మహిళలు, పురుషులు పట్టుబడ్డారు. వ్యభిచార కార్యకలాపాలు జరుగుతున్నాయని నిర్ధారణ కావడంతో నిర్వాహకులపై కేసులు నమోదయ్యాయి. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న స్పా యజమానులకు టాస్క్ ఫోర్స్ దాడులతో వణుకు పుడుతోంది.


గుంటూరు రాజధాని జిల్లాగా మారిపోయింది. గుంటూరు నగరం కూడా శర వేగంగా విస్తరిస్తుంది. ఇందులో భాగంగానే కొత్త కొత్త సంస్కృతులు పుట్టుకొస్తున్నాయి. నగరంలో పెద్ద ఎత్తున స్పా సెంటర్లు వెలుస్తున్నాయి. లక్ష్మీపురంతో పాటు ఇన్నర్ రింగ్ రోడ్డు కూడా స్పా కేంద్రాలకు నిలయంగా మారింది. మస్సాజ్ పేరుతో వెలుస్తున్న సెంటర్స్ కొద్దీ రోజుల తర్వాత వ్యభిచార కేంద్రాలుగా మారుతున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాలతో స్పా సెంటర్స్ పై టాస్క్ ఫోర్స్ పోలీసులు ప్రత్యేక దాడులు చేస్తున్నారు. దాడుల్లో పలు కేంద్రాల్లో వ్యభిచారం జరగుతున్నట్లు గుర్తించారు. నల్లపాడు పిఎస్ పరిధిలోని ఇన్నర్ రిండ్ రోడ్డులో ఉన్న ఐరా స్పా సెంటర్ పై టాస్క్ పోర్స్ సిబ్బంది దాడి చేసింది. ఈ దాడిలో వ్యభిచారం జరుగుతున్నట్లు గుర్తించారు. మొత్తం ముగ్గురు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఇద్దరూ ఇతర రాష్ట్రాలకు చెందిన మహిళలుగా గుర్తించారు. వీరితో పాటు ఒక పురుషుడిని అదుపులోకి తీసుకొని స్పా మేనేజర్ సూర్యపై కేసు నమోదు చేసి నల్లపాడు పీఎస్ కు తరలించారు.


ఇన్నర్ రింగ్ రోడ్డులోనే ఏ9 బ్యూటీ సెలూన్ అండ్ స్పా పై కూడా టాస్క్ పోర్స్ దాడులు చేసింది. ఈ దాడుల్లో ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన మహిళతో పాటు మరో ముగ్గురు మహిళలున్నారు. ఇక్కడ కూడా వ్యభిచారం జరుగుతుందని రూఢీ చేసుకున్న తర్వాతే దాడి చేసినట్లు తెలుస్తుంది.

రెండు రోజులుగా దాడులు చేస్తున్న టాస్క్ పోర్స్ దృష్టికి అనేక అక్రమాలు వచ్చాయి. ఈ క్రమంలోనే నగరంలో పుట్టుగొడుగుల్లా పుట్టుకొస్తున్న స్పా, బ్యూటీ సెలూన్స్ పై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ కూడా స్పా సెంటర్స్ లో జరుగుతన్న అసాంఘీక కార్యకలాపాలపై సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తుంది. దీంతో సాధారణ పోలీసులను కాకుండా టాస్క్ పోర్స్ ను రంగంలోకి దించి దాడులు చేయిస్తున్నట్లు భావిస్తున్నారు. ఆయా స్టేషన్ పరిధిలో ఉండే స్పా సెంటర్స్ నిర్వాహకులు స్టేషన్ సిబ్బంది మధ్య కొంత అవగాహన ఉండొచ్చన్న అనుమానంతో ఏకంగా దాడులకు ఎస్పీ టాస్క్ పోర్స్ సిబ్బందిని దాడులకు ఉపయోగిస్తున్నారు. దీంతో స్పా నిర్వాహకులు దొరికిపోతున్నారు.

Also read

Related posts