SGSTV NEWS online
Andhra PradeshCrime

అనంతపురంలో మరో వలపువల వెలుగులోకి వచ్చింది.



అనంతపురంలో మరో వలపువల..పల్నాడు జిల్లా వాసి కి ఇన్‌స్టాగ్రామ్‌లో వల వేసి దోపిడి…సీన్ మములుగాలేదు బాబోయ్!*


గుత్తి టౌన్‌కు రావాలంటూ పల్నాడు జిల్లా మాచర్లకు చెందిన యువకుడికి ఇన్‌స్టా‌గ్రామ్‌లో కర్నూలు జిల్లా జొన్నగిరికి చెందిన యువతి వలపు వల వేసింది.   ఈ క్రమంలో ఆ యువకుడు గుత్తి టౌన్‌కు చేరుకున్నాడు.  ఈ సమయంలో యువకుడిని నిర్మానుష్య ప్రదేశానికి యువతి తీసుకెళ్లింది.  చీకట్లో ఆ యువకుడిపై దాడికి పాల్పడి డబ్బు, బంగారం, సెల్‌ఫోన్‌ను యువతి గ్యాంగ్ లాక్కొంది.

దాడి నుంచి తప్పించుకుని సమీపంలో ఓ దాబా వద్దకు పరిగెత్తుకుంటూ బాధిత యువకుడు వెళ్లాడు. ఈ దాడి ఘటన గురించి పోలీసుల దృష్టికి తీసుకెళ్లేందుకు యత్నించాడు ఆ యువకుడు.
ఇంతలో అక్కడికి చేరుకున్న యువతి గ్యాంగ్.. పోలీసుల సమక్షంలోనే మరోసారి దాడికి పాల్పడింది.  దాడి చేసిన వ్యక్తులు ఓ రాజకీయ పార్టీ నాయకుడికి సన్నిహితులమని బెదిరించారు.
దీంతో కేసు వద్దంటూ బాధిత యువకుడు పోలీసులను వేడుకున్నాడు. దీంతో యువతిని గ్యాంగ్‌ను వదిలిపెట్టారు పెద్దవడగూరు పోలీసులు.

Also read

Related posts