కాకినాడ : కాకినాడలోని ఈవీఎం గోదాము వద్ద విధుల్లో ఉండగా తుపాకీ మిస్ఫైర్ అయి హెడ్కానిస్టేబుల్ లంకే ధనరాజు ఛాతీలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. తీవ్ర రక్తస్రావం జరగడంతో ఆయనను సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. సోమవారం ఉదయం జరిగిన ఘటనపై కాకినాడ మూడో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. కాకినాడలోని జగన్నాథపురానికి చెందిన ధనరాజు హెడ్కానిస్టేబుల్గా పనిచేస్తూ ప్రసుత్తం వీఆర్ లో ఉన్నారు. ఆయన ఇటీవల అల్లూరి జిల్లా నుంచి బదిలీపై కాకినాడ జిల్లాకు వచ్చారు. మరలా తూర్పుగోదావరి జిల్లాకు బదిలీ కావాల్సి ఉంది. ఈ ప్రక్రియ జరుగుతుండగానే విధుల్లో తుపాకీ పేలి గాయాలతో ఆసుపత్రి పాలవడం చర్చనీయాంశమవుతోంది. బదిలీ భయంతో పాటు కుటుంబ సంబంధిత సమస్యలతో అతనే కాల్చుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వాదనలను పోలీసులు కొట్టిపారేశారు. తుపాకీని శుభ్రం చేస్తుండగా మిస్ ఫైర్ కావడం వల్లే గాయాలపాలయ్యారని చెబుతున్నారు.
Also read
- నువ్వు బంగారు బాతువు’.. హెడ్ కానిస్టేబుల్ వ్యాఖ్యలు వైరల్
- రూ.కోటిన్నర బంగారం కొట్టేసింది కూతురే..!
- తండాలో కలకలం.. భార్య-కొడుకు కలిసి భర్తను చంపి.. సినిమా స్టైల్లో నాటకం!
- తుపాకీ మిస్ఫైర్.. హెడ్కానిస్టేబుల్ ఛాతీలో దిగిన బుల్లెట్
- మహిళా పోలీసు ఆత్మహత్య





