కాకినాడ కాకినాడ కలెక్టరేట్ సమీపంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఈవీఎం మిషన్ల భద్రత కోసం గార్డుగా విధులు నిర్వహిస్తున్న ఒక హెడ్ కానిస్టేబుల్ తన సర్వీస్ రైఫిల్తో కాల్చుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటన స్థానికంగా మరియు పోలీస్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. ఘటన వివరాల్లోకి వెళ్తే.. కాకినాడ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న ధనరాజు, ప్రస్తుతం కలెక్టరేట్ సమీపంలోని ఈవీఎం భద్రతా కేంద్రం వద్ద డ్యూటీలో ఉన్నారు. సోమవారం విధుల్లో ఉండగానే, తన వద్ద ఉన్న 303 రైఫిల్తో ఒక్కసారిగా తనపై తాను కాల్పులు జరుపుకున్నారు. కాల్పుల శబ్దం విన్న తోటి సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, రక్తపు మడుగులో ఉన్న ధనరాజును గమనించారు. ఆయనను వెంటనే కాకినాడ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (జిజిహెచ్)కి తరలించారు.
Also read
- బచ్చలకూర అనుకుని పప్పులో గన్నేరాకు వేసి
- ‘సారీ రాధికా.. గుడ్బై’.. భార్య పుట్టినరోజు నాడే హైదరాబాద్ టెకీ ఆత్మహత్య
- ప్రియురాలి బర్త్డే.. ఐఫోన్ సర్ప్రైజ్ ప్లాన్.. చివరికి పోలీసులకు అడ్డంగా బుక్కైన లవర్స్..
- ప్రేమ పెళ్లి.. ఇద్దరు పిల్లలు.. కట్చేస్తే.. ఆ ఇంట్లో ఆ రాత్రి ఏం జరిగింది..?
- గన్నేరు ఆకులతో పప్పు వంట! అంగన్వాడీలో ఫుడ్ పాయిజన్.. ముగ్గురు చిన్నారులు, ఇద్దరు తల్లులకు అస్వస్థత





