👉 భార్యను కాపురానికి పంపడం లేదని అత్తపై అల్లుడు దారుణం
👉 అత్తను కరెంట్ షాక్ తో చంపడానికి ప్రయత్నించాడు అల్లుడు
👉అల్లుడు మల్లారెడ్డి పై అత్త రాజవ్వ పోలీసులకు ఫిర్యాదు
భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు సర్వ సాధారణమే. అయితే ఈ గొడవలు కాస్త చిలికి చిలికి గాలివానలా మారి విడాకులకు దారితీస్తుంటాయి. కొన్నిసార్లు హింసాత్మకంగా మారుతుంటాయి. తాజాగా జగిత్యాలలో దారుణ ఘటన వెలుగుచూసింది. భార్యను కాపురానికి పంపడం లేదని అత్తపై ఓ అల్లుడు దారుణానికి ఒడిగట్టాడు. అత్తను కరెంట్ షాక్ తో చంపడానికి ప్రయత్నించాడు అల్లుడు. వెలగటూర్ మండలం జగదేవ్ పేట గ్రామానికి చెందిన గాగిరెడ్డి మల్లారెడ్డి (48), పద్మ ఇరవై ఐదు సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నారు.
కొంతకాలం వరకు సవ్వంగానే సాగిన వీరి కాపురం ఆ తర్వాత కలహాలు చోటుచేసుకున్నాయి. భార్య భర్తల మధ్య గొడవలు కాగా తన పిల్లలతో పుట్టింటికి వెళ్ళింది భార్య పద్మ.
తన భార్యను పద్మ తల్లి రాజవ్వ కాపురానికి పంపడం లేదని కోపం పెంచుకొని హతమార్చలని ప్లాన్ వేశాడు అల్లుడు గాగిరెడ్డి మల్లారెడ్డి. రాజవ్వ ఇంటి తలుపులకు విద్యుత్ అమర్చాడు. ఉదయం తలుపులు తెరువగానే రాజవ్వకు స్వల్పంగా విద్యుత్ షాక్ తగిలింది. అల్లుడు మల్లారెడ్డి పై అత్త రాజవ్వ పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితున్ని అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపినట్లు వెల్గటూర్ పోలీసులు తెలిపారు.
Also read
- Hyderabad: నగరంలో భారీ మోసం.. కస్టమర్ అకౌంట్ నుంచి రూ.6.5 కోట్లు మాయం.. కట్చేస్తే..
- ఓ వ్యక్తిని బండరాళ్లతో కొట్టుకుంటూ.. వీడియోలు షూట్ చేసిన మానవ మృగాలు..!
- Telangana: పరీక్షలో ఫెయిలయ్యానని విద్యార్థిని సంచలన నిర్ణయం.. ఏం చేసిందంటే?
- Sri Veereswara Swamy Temple : మీకు పెళ్లి కావట్లేదా..? వెంటనే కోనసీమలో ఉన్న ఈ ఆలయంలో కళ్యాణం చేయించండి..
- జేబులో బోలెడంత డబ్బు.. ఈ మూడు రాశుల వారి ఇంట ధన వర్షమే!





