అమీర్ పేట్ : ఎటీఎంలలో పెట్టాల్సిన నగదు భారీగా మాయమైన ఘటన హైదరాబాద్ లోని ఎస్ ఆర్ నగర్ పోలీసుస్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది.
ఏటీఎంలలో నింపాల్సిన నగదు నుంచి రూ.1.20 కోట్లకు పైగా డబ్బు మాయమైనట్లు అధికారులు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సికింద్రాబాద్ లోని సీఎంఎస్ ఇన్ఫో సిస్టమ్స్ లిమిటెడ్ సంస్థ బ్రాంచ్ మేనేజర్ నవీన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది.
సాధారణంగా సీఎంఎస్ సంస్థ వివిధ బ్యాంకుల నుంచి నగదును తీసుకుని ఏటీఎంలలో నింపుతుంది. ఇటీవల నిర్వహించిన ఆడిట్లో ఎస్సార్నగర్ పరిధిలోని 31 ఏటీఎంలలో తనిఖీలు చేపట్టగా.. 8 ఏటీఎంలలో భారీగా నగదు కొరత ఉన్నట్లు గుర్తించారు. మొత్తం రూ.1,20,98,500 నగదు లోటు ఉన్నట్లు తేల్చారు. ఈ ఘటనలో ఇద్దరు కస్టోడియన్లపై అనుమానం వ్యక్తమవుతోంది. వారు విధులకు హాజరు కాకపోవడం.. ఫోన్ కాల్స్క స్పందించకపోవడంతో అనుమానం మరింత పెరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి.. పరారీలో ఉన్న ఇద్దరు నిందితుల కోసం గాలింపు చేపట్టారు.
Also read
- శ్రీ శంకర జయంతి మహోత్సవ 2026
- Lord Ganapati: ఏ పూజ చేసిన మొదట గణపతినే ఎందుకు పూజిస్తారు..?
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- అయ్యో.. ఎంత పని చేశావ్ అక్షంత్..! ఒక్క రోజు ఓపిక పట్టి ఉంటే..
- సొంత అన్నను కడతేర్చిన తమ్ముడు.. అడ్డొచ్చిన కుటుంబసభ్యులపై దాడి..!





