రెండు కిలోల బంగారు ఆభరణాలు, రూ.26 లక్షలతో పరారీ
బెంగళూరు (యశ్వంతపుర): భర్తకు, పిల్లలకు దూరంగా ఉంటూ ఒంటరిగా ఉంటున్న ఓ సంపన్న మహిళను ఇద్దరు వ్యక్తులు నిలువునా ముంచేశారు. ఆమెనుంచి విడతల వారీగా బంగారం, డబ్బు తీసుకుని ఉడాయించారు. బెంగళూరులో జరిగిన ఈ ఘటనకు సంబంధించి నగర పోలీస్ కమిషనర్ సీమంత్ కుమార్ సింగ్ తెలిపిన వివరాల మేరకు.. బెంగళూరుకు చెందిన ఓ వివాహిత(38)కు సామాజిక మాధ్యమాల ద్వారా తెలంగాణలోని చెన్నూరుకు చెందిన మహేశ్ అలియాస్ పృథ్వీరెడ్డి(34), ఏపీలోని అనంతపురం నివాసి వి.స్వామి (38) అనే వ్యక్తులు పరిచయమయ్యారు. ఆమె భర్త బిల్డర్ కాగా వారికి ఇద్దరు పిల్లలు. ఏడాదిన్నరగా కుటుంబానికి ఆమె దూరంగా, ఒంటరిగా జీవిస్తుండటంతో దానిని అలుసుగా తీసుకుని నిందితులు స్నేహం పెంచుకున్నారు. ఏవో అవసరాల కోసమంటూ రెండు కిలోల బంగారు నగలు, రూ.26 లక్షల నగదును విడతల వారీగా తీసుకున్నారు. నెల క్రితం కనిపించకుండా మాయమయ్యారు. దుండగుల మోసాన్ని ఆలస్యంగా గుర్తించిన బాధితురాలు.. పోలీసులను ఆశ్రయించడంతో నిందితులను పట్టుకున్నామని కమిషనర్ వెల్లడించారు.
కొంత బంగారాన్ని, సొమ్మును వారు ఇప్పటికే వాడేశారని, 571 గ్రాముల బంగారు నగలనే స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
Also read
- మంత్రాలయంలో రాఘవేంద్ర స్వామి సజీవ బృందావనం- ఈ పవిత్ర క్షేత్రం గురించి తెలుసా?
- Weekly Horoscope: ఈ రాశులకు ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక విషయాల్లో శుభవార్తలు
- శ్రావణ సోమవారం: మార్కండేయుడిని మృత్యువు నుంచి కాపాడిన శివుడు.. భక్తికి ఉన్న శక్తి ఇదే!
- పాండవుల కోసం శ్రీకృష్ణుడు కోరిన ఆ 5 గ్రామాలు ఇప్పుడు ఎక్కడున్నాయి? నేటి పేర్లు ఇవే!
- Mala Japa Rules: జపమాలతో మంత్రం జపిస్తున్నారా?.. ఈ చూపుడు వేలు నియమం మీకు తెలుసా?





