దేవుడు అంటే అందరికీ భయం, భక్తి ఉంటాయి. ఆలయంలో పనిచేస్తున్నవారి పట్ల గౌరవం, మర్యాదలు పాటిస్తుంటారు భక్తులు. కానీ ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయంలో పనిచేసే సిబ్బంది ఏకంగా టికెట్స్ స్కామ్ తెరలేపారు. ఆధునిక ప్రింటింగ్ టెక్నాలజీ, సాఫ్ట్వేర్ ఉపయోగించి దేవాలయాన్నే బురిడి కొట్టించారు. కానీ ఎవరి పాపమైనా ఎన్నాళ్లు సాగుతుంది. ఫైనల్గా పోలీసులకు చిక్కక తప్పలేదు.
వివరాల్లోకి వెళ్తే.. ద్వారకా తిరుమల దేవస్థానంలో నకిలీ టికెట్లు విక్రయాల కేసులో ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు తాజాగా ప్రధాన నిందితులతో పాటు మరో ఆరుగురుని అరెస్ట్ చేశారు. నకిలీ టికెట్లు అమ్మడం కోసం ప్రత్యేక సాఫ్ట్వేర్ను దేవస్థానం ఉద్యోగులే రూపొందించారని పోలీసులు తేల్చారు. దేవస్థానం టికెట్ కౌంటర్ల ఉద్యోగి సాయి జగన్నాథరాజు, కంప్యూటర్ సూపర్వైజర్ రమేష్లు కలిసి నకిలీ టికెట్లు తయారుకు ప్లాన్ చేశారు. తాడేపల్లిగూడెంకి చెందిన రమేష్ స్నేహితుడు ముత్యాల వెంకట సత్య శ్రీనివాసరావు సహకారంతో ప్రత్యేక సాఫ్ట్వేర్ను రూపొందించి దానిద్వారా నకిలీ టికెట్లు ముద్రించి కౌంటర్లో భక్తులకు విక్రయించి అక్రమంగా డబ్బు సంపాదించారు. నకిలీ టికెట్లు వ్యవహారంపై నిఘా పెట్టిన అధికారులు గత నెలలో 61 నకిలీ టికెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ నకిలీ టికెట్లు వ్యవహారంపై దేవస్థానం ఈవో భద్రాజి పోలీసులకు ఫిర్యాదు చేసారు. ఈవో భద్రాజి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు పూర్తి స్దాయిలో దర్యాప్తు చేసి నకిలీ టికెట్లు అమ్ముతున్న అందరిని అరెస్ట్ చేశారు. నకిలీ టికెట్లు ముద్రణకు ఉపయోగించిన లాప్టాప్, ప్రింటర్, ఐదు సెల్ ఫోన్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Also read
- చెత్త కుప్పలో డైమండ్ రింగ్స్.. కేటుగాడు వేసిన మాస్టర్ ప్లాన్ బెడిసికొట్టిందిలా..
- పెళ్లైన రెండువారాలకే కనిపించని యువతి.. కట్చేస్తే.. ప్రియుడితో కలిసి..
- సూర్యుడు అస్తమించగానే ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఇలా చేయండి, లక్ష్మీదేవి మీ ఇంట్లో కొలువై ఉంటుంది!
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- Kamakshi Deepam: పూజ గదిలో కామాక్షి దీపం ఉందా? అయితే వెలిగించేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి!





