రేగొండ: వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ఓ తండ్రిని కుమారులు చంపారు. ఈ ఘటన భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రేపాకలో జరిగింది. రేపాకలో చేరాలు అనే వ్యక్తి ఒంటరిగా ఉంటుండగా, అతడి భార్య హైదరాబాద్లో కుమారుల వద్ద ఉంటోంది. మరో మహిళతో తండ్రి వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని కుమారులకు తెలిసింది. దీంతో వారు గ్రామానికి వచ్చారు. మరో మహిళతో తండ్రి ఉండగా గమనించి దాడి చేశారు. దీంతో చేరాలుతో పాటు మహిళకు తీవ్రగాయాలయ్యాయి. వారిని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ చేరాలు మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Also read
- Arava Sridhar: పవన్ కళ్యాణ్ గారూ.. ఇదేనా మీ ‘ప్రశ్నించే’ తత్వం.. సొంత ఎమ్మెల్యేపై చర్యలేవి?
- సీన్ చూసి యాక్సిడెంట్ అనుకునేరు.. అసలు మ్యాటర్ తెలిస్తే.. ఫ్యూజులెగరాల్సిందే
- ఏపీలో తప్పని డోలీ మోతలు..5 కిలోమీటర్లు, ఏడు వాగులు దాటి ఆసుపత్రికి.. వీడియో వైరల్
- Telangana: 5 పదుల వయసు దాటిన ఆళిపై అనుమానం.. పెనుభూతంగా మారి..
- Hyd: దారుణం.. మహిళను, స్కూటీని ఈడ్చుకెళ్లిన ట్రక్





