రేగొండ: వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ఓ తండ్రిని కుమారులు చంపారు. ఈ ఘటన భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రేపాకలో జరిగింది. రేపాకలో చేరాలు అనే వ్యక్తి ఒంటరిగా ఉంటుండగా, అతడి భార్య హైదరాబాద్లో కుమారుల వద్ద ఉంటోంది. మరో మహిళతో తండ్రి వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని కుమారులకు తెలిసింది. దీంతో వారు గ్రామానికి వచ్చారు. మరో మహిళతో తండ్రి ఉండగా గమనించి దాడి చేశారు. దీంతో చేరాలుతో పాటు మహిళకు తీవ్రగాయాలయ్యాయి. వారిని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ చేరాలు మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Also read
- మరణానంతరం గరుడ పురాణం ఎందుకు చదువుతారు? 13 రోజుల పారాయణం వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే!
- Mysterious Temple: ఈ ఆలయంలో దెయ్యాలకు శిక్ష పడుతుందట..! ప్రసాదాన్ని ఇంటికి తీసుకెళ్తే ఏమవుతుందో తెలుసా?
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- కృష్ణాజిల్లాలో విషాదం.. ఒకే ఇంట్లో ముగ్గురు మహిళల ఆత్మహత్య
- నా కొడుకు శవమైనా ఇవ్వండి





