రేగొండ: వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ఓ తండ్రిని కుమారులు చంపారు. ఈ ఘటన భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రేపాకలో జరిగింది. రేపాకలో చేరాలు అనే వ్యక్తి ఒంటరిగా ఉంటుండగా, అతడి భార్య హైదరాబాద్లో కుమారుల వద్ద ఉంటోంది. మరో మహిళతో తండ్రి వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని కుమారులకు తెలిసింది. దీంతో వారు గ్రామానికి వచ్చారు. మరో మహిళతో తండ్రి ఉండగా గమనించి దాడి చేశారు. దీంతో చేరాలుతో పాటు మహిళకు తీవ్రగాయాలయ్యాయి. వారిని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ చేరాలు మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Also read
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?,
- అల్లూరి జిల్లాలో దారుణం… పింఛను డబ్బుల కోసం తండ్రిని చంపిన కొడుకు!
- ప్రేమిస్తున్నానంటూ వేధింపులు.. యువకుడికి అరగుండు కొట్టించి ఊళ్లో ఊరేగింపు..
- Andhra: రాజ్యలక్ష్మీ నేను నీతోనే.. భార్యపై ప్రేమతో పక్కనే సమాధి కట్టించుకున్న భర్త.. ఎక్కడంటే..
- ఉన్నోడిలా నటించాడు.. ఉన్నకాడికి దోచేశాడు.. సీన్కట్చేస్తే..





