సోంపేట, : శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం బారువ కోటిలింగేశ్వర ఆలయ ఆవరణలోని ఉమామహేశ్వర దేవాలయానికి చెందిన నంది విగ్రహాన్ని గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేశారు. మొదట ఆలయంలోని విగ్రహాన్ని ఎత్తుకెళ్లి, సుమారు కిలోమీటరు దూరంలో ఉన్న పంట పొలాల్లో ధ్వంసం చేసి వదిలేశారు. ఈ ఘటన శనివారం తెల్లవారుజామున జరిగినట్లుగా భావిస్తున్నారు. పోలీసు అధికారులతో పాటు క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ బృందాలు ఆలయంతో పాటు విగ్రహాన్ని పగలగొట్టిన పొలం, ఇతర ప్రదేశాలను పరిశీలించాయి. ఇద్దరు వ్యక్తులు కలిసి ఈ దుశ్చర్యకు పాల్పడి ఉంటారని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. పురాతన నాణేలు దొరుకుతాయన్న ఆశతో ఈ చర్యకు పాల్పడ్డారా.. లేక వేరే కారణాలున్నాయా అనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు. ఆలయం పునర్నిర్మాణం జరుగుతున్న సమయంలో ఇలా జరగడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దేవుడికి ఎదురుగా చిన్న గదిలో అమర్చిన ఆ విగ్రహాన్ని దుండగులు తొలగించారు. గునపంతో ఓ చోట రంధ్రం చేసి పెకిలించిన ఆనవాళ్లున్నాయి.
Also read
- జలుబు చేసిందని RMP డాక్టర్ దగ్గరికి వెళ్తే.. ఏకంగా ప్రాణాలే పోయాయ్!
- సిని ఫక్కీలో చేజింగ్.. చైన్ స్నాచర్లను పట్టుకున్న సరిహద్దు గ్రామస్తులు..! మహిళ సహా..
- ‘చనిపోయిన 7 నిమిషాల తర్వాత కూడా మెదడు పనిచేస్తుందట.. అప్పుడూ నీ గురించే ఆలోచిస్తా..!’
- Hyderabad: అతన్ని గుడ్డిగా నమ్మింది.. హోటల్కు వెళ్లింది.. కట్చేస్తే.. అసలు మ్యాటర్ తెలిసి..
- అగస్త్య మహర్షి ప్రతిష్ఠించిన శివలింగం- ప్రొద్దుటూరులో అరుదైన నవగ్రహ మండపం విశేషాలివే!




