నా కుమార్తె కనిపించడం లేదు.. ఎనిమిది రోజుల క్రితం ఇంటి నుండి వెళ్లిపోయింది. బ్రతికే ఉందా.. లేదా.. చెప్పాలంటూ ఆ తండ్రి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాడు. ఎక్కడికి వెళ్లిందో తెలియక ఆవేదన చెందుతున్నాడు. ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోకపోవడంతో మనస్థాపం చెంది పోలీస్ స్టేషన్ లోనే పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ఈ ఘటన పల్నాడు జిల్లాలో వెలుగు చూసింది.
పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలోని ఇరవై రెండు వార్డు యాదవుల బజార్ కు చెందిన కామనబోయిన చంద్ర శ్రీను పశువుల కొనుగోలు మధ్యవర్తిత్వం చేస్తుంటాడు. ఇతనికి ఇద్దరు పిల్లులున్నారు. కుమార్తె చౌడేశ్వరి ఇంటర్ వరకూ చదివి ఆ తర్వాత ఇంటి వద్దే ఉంటుంది. ఈ నెల నాలుగో తేదిన చౌడేశ్వరి రాత్రి ఏడు గంటల సయమంలో ఇంటిలో నుండి వెళ్లిపోయింది. దీంతో చంద్రశ్రీను అందరి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి వాకబు చేశాడు. ఎవరూ కూడా తమ ఇంటికి రాలేదని చెప్పాడు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మాచర్ల పట్టణ పోలీసులు ఇదిగో అదిగో అంటూ కాలం వెళ్లబుచ్చుతున్నారు. దీంతో చంద్ర శ్రీను తీవ్ర ఆవేదనకు లోనయ్యాడు.
కన్న కూతురు కనిపించక వారం రోజులు దాటి పోయింది. అసలు ఉందో లేదో అన్న అనుమానం పీడిస్తోంది. ఈ క్రమంలోనే పోలీస్ స్టేషన్ కు వెళ్లి తమ బిడ్డ ఆచూకీ ఎమైనా లభించిందా అని ఆరా తీశాడు. పోలీసుల నుండి ఎటువంటి స్పందన రాలేదు. దీంతో తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ ఒంటిపై పోసుకొని ఆత్మహత్యయ్నం చేయబోయాడు. వెంటనే బంధువులు అతన్ని నిలువరించి ఒంటిపై నీళ్లు పోశారు. వారం రోజుల క్రితం తన కూతురు వెళ్లిపోయిందని పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని చంద్ర శ్రీను వాపోయాడు.
అయితే చౌడేశ్వరి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తు్న్నామంటున్నారు. మేజర్ కావడంతో ఆమె ఎక్కడికి వెళ్లిందో అన్న అంశంపై ఇంకా స్పష్టత రాలేదని చెబుతున్నారు. ప్రేమ వ్యవహారమా లేదా ఇతర కారణలేమైనా ఉన్నాయా అన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. త్వరలోనే చౌడేశ్వరి ఆచూకీ కనుగొంటామని పోలీసులు చెబుతున్నారు.
Also read
- చెంబులో ‘కీ’… అదే కలిసొచ్చింది దొంగలకి
- ఫేస్ బుక్ లో వల.. సహజీవనం తర్వాత అసలు రంగు!
- భర్త కువైట్లో.. భార్య కడపలో.. డ్రైవర్తో అలా కనిపించే సరికి..
- విశాఖ ప్రమాద బాధితులకు కోటిరూపాయల పరిహారం ఇవ్వాలి…… గ్రీష్మ కుమార్ ఐ.యఫ్.టీ.యు రాష్ట్ర కమిటీ సభ్యులు.
- భార్యభర్త మధ్యలో ప్రియుడు.. ఆయన లేడని ఇంటికి పిలిచింది.. తర్వాతి సీన్ ఇదే..





