నాగర్కర్నూల్ జిల్లాలో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. మూడు నెలల బాలుడు నీటి తొట్టిలో శవమై కనిపించడం కలకలం రేపింది. బిజినేపల్లి మండలం పాలెం గ్రామంలో ఈ తీవ్ర విషాదం వెలుగులోకి వచ్చింది. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
బిజినేపల్లి మండలం పాలెం గ్రామానికి చెందిన దంపతుల మధ్య గత కొద్ది రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. దీంతో మూడు నెలల బాబుని తీసుకుని తల్లిగారి ఇంటి దగ్గరకు వచ్చింది నీలమ్మ. దీంతో భర్త అమెను తీసుకువెళ్లేందుకు పాలెం గ్రామానికి వచ్చాడు. అయితే భార్యాభర్తల మధ్య విభేదాల గురించి మాట్లాడడానికి ఇరు కుటుంబాలు శుక్రవారం (ఫిబ్రవరి 27) పంచాయితీకి వచ్చాయి. పంచాయితీ ఎటూ తేలకపోవడంతో ఎవరింటికి వాళ్లు వెళ్లిపోయారు.
అయితే అర్ధరాత్రి సమయంలో తల్లి ఒడిలో ఉండాల్సిన బాలుడు కనపించకుండా పోయాడు. దీంతో కంగారుపడ్డ నీలమ్మ బాబు ఆచూకీ కోసం వెతుకుతుండగా నీటి తొట్టిలో బాబు మృతదేహం లభ్యం అయ్యింది. బాబు మృతికి తండ్రే కారణమని తల్లి, ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న బిజినేపల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. భార్యాభర్తలు ఇద్దరినీ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Also read
- తీర్థం తీసుకునేటప్పుడు ఈ తప్పు చేస్తున్నారా? అయితే అపచారమే
- శని దోషాలు: శని దోషాలతో బాధ పడుతున్నారా? భయం వద్దు.. ఈ జాగ్రత్తలు పాటిస్తే చాలు!
- శని నక్షత్ర మార్పు: ఏప్రిల్ 17 నుంచి ఈ 5 రాశుల వారికి తిరుగుండదు.. పట్టరాని అదృష్టం!
- నేటి జాతకములు..18 ఏప్రిల్, 2026
- భవన నిర్మాణ కార్మికుల కు కూటమి ప్రభుత్వ వెన్నుపోటు….. గ్రీష్మ కుమార్, ఐ.యఫ్.టి.యు రాష్ట్ర కమిటీ సభ్యులు.





