నాగర్కర్నూల్ జిల్లాలో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. మూడు నెలల బాలుడు నీటి తొట్టిలో శవమై కనిపించడం కలకలం రేపింది. బిజినేపల్లి మండలం పాలెం గ్రామంలో ఈ తీవ్ర విషాదం వెలుగులోకి వచ్చింది. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
బిజినేపల్లి మండలం పాలెం గ్రామానికి చెందిన దంపతుల మధ్య గత కొద్ది రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. దీంతో మూడు నెలల బాబుని తీసుకుని తల్లిగారి ఇంటి దగ్గరకు వచ్చింది నీలమ్మ. దీంతో భర్త అమెను తీసుకువెళ్లేందుకు పాలెం గ్రామానికి వచ్చాడు. అయితే భార్యాభర్తల మధ్య విభేదాల గురించి మాట్లాడడానికి ఇరు కుటుంబాలు శుక్రవారం (ఫిబ్రవరి 27) పంచాయితీకి వచ్చాయి. పంచాయితీ ఎటూ తేలకపోవడంతో ఎవరింటికి వాళ్లు వెళ్లిపోయారు.
అయితే అర్ధరాత్రి సమయంలో తల్లి ఒడిలో ఉండాల్సిన బాలుడు కనపించకుండా పోయాడు. దీంతో కంగారుపడ్డ నీలమ్మ బాబు ఆచూకీ కోసం వెతుకుతుండగా నీటి తొట్టిలో బాబు మృతదేహం లభ్యం అయ్యింది. బాబు మృతికి తండ్రే కారణమని తల్లి, ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న బిజినేపల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. భార్యాభర్తలు ఇద్దరినీ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Also read
- భార్య ఫోన్ ఎక్కువగా మాట్లాడుతుందనీ.. కత్తితో పొడిచి హతమార్చిన భర్త!
- Vizag: రాధా గాయత్రి మృతి కేసులో సంచలనం.. కీలక అప్ డేట్
- పద్దతిగా భర్తను గుడికి తీసుకెళ్లింది.. బాయ్ ఫ్రెండ్తో కలిపి లేపేసింది.. ఏపీలో సంచలనం
- Garuda Purana: మరణం తర్వాత ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? గరుడ పురాణం ప్రకారం స్వర్గం, నరకం, వైకుంఠం రహస్యాలు
- సూర్యాస్తమయం తర్వాత ఈ 6 వస్తువులు కొనొద్దు.. లక్ష్మీదేవి అనుగ్రహానికి దూరమవుతారా? వాస్తు ఏం చెబుతోంది?





