మద్యం మత్తులో కుమార్తెతో సహా కాలువలోకి దూకిన తండ్రి.. చిన్నారి మృతి
జగ్గంపేట: భార్యాభర్తల మధ్య నెలకొన్న కీచులాట 11 నెలల చిన్నారి ప్రాణాలు తీసింది. ఈ దారుణ సంఘటన కాకినాడ జిల్లా జగ్గంపేటలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. జగ్గంపేట టీచర్స్ కాలనీలో ఓడిబోయిన మణికంఠ, సాయి దంపతులు నివాసం ఉంటున్నారు. మణికంఠ మద్యానికి బానిసై జీవనోపాధికి కూడా ఇబ్బంది పడడంతో దంపతుల మధ్య తరచూ వివాదాలు జరుగుతున్నాయి.
గురువారం కూడా భార్యాభర్తల మధ్య వివాదం జరిగింది. ఈ నేపథ్యంలో అత్తింటి వారు పరుషంగా మాట్లాడడంతో కోపంతో ఊగిపోయిన మణికంఠ 11 నెలల కుమార్తెను తీసుకుని స్థానికంగా ఉన్న పోలవరం కాలువలోకి మోటార్ సైకిల్తో సహా దూసుకుపోయాడు. గుర్తించిన స్థానికులు వారిని రక్షించేందుకు ప్రయత్నించారు. అప్పటికే చిన్నారి మృతి చెందింది. దీంతో తల్లి కన్నీరుమున్నీరుగా విలపించింది జగ్గంపేట ఎస్ ఐ రఘునాథరావు కేసు నమోదు చేశారు.
Also read
- షాపింగ్ మాల్లో సీక్రెట్ ప్లాన్ ఫెయిల్… జీడిపప్పు కేసులో మహిళల అరెస్ట్
- డిప్యూటీ ఎమ్మార్వో సంధ్య ప్రేమ వివాహం.. వరుడి దారుణ హత్య
- నెల్లూరు జిల్లాలో దాష్టీకం
- లాడ్జిలో అగ్ని ప్రమాదం.. ఒకరి సజీవదహనం
- చిన్నారి ఉసురు తీసిన భార్యాభర్తల వివాదం





