ఒక టీ షాపులో వన్ బై త్రీ కాఫీ ఇవ్వలేదని ఓ మున్సిపల్ అధికారి ఆవేశంతో ఊగిపోయారు. అరగంటలో ప్రోక్లైన్తో అక్కడికి వచ్చారు. షాపు ముందు ఉన్న ర్యాంపు తొలగించడానికి ప్రయత్నం చేశారు. అంతే సీన్ అంతా ఒక్కసారిగా రివర్స్ అయింది. అసలు ఏం జరిగిందో ఈ కథనంలో తెలుసుకుందాం..
ప్రొద్దుటూరు నగరంలో ఉన్న టీ షాపు వద్దకు ఓ మున్సిపల్ అధికారి.. అతనితో పాటు మరో ఇద్దరు కాఫీ తాగడానికి వచ్చారు. అయితే వన్ బై త్రీ కాఫీని ఇవ్వాలని ఆ హోటల్ వారిని కోరారు.. అయితే.. వారు తమ దగ్గర ఇలాంటి పద్ధతి లేదని సమాధానం ఇచ్చారు. దీంతో ఆ హోటల్లో ఉన్న సిబ్బందిపై కొద్దిసేపు వాదించిన అధికారి.. ఓ అరగంట తర్వాత జెసిబీతో ఆ హోటల్ ముందు ప్రత్యక్షమయ్యారు. హోటల్ మున్సిపాలిటీ స్థలాన్ని ఆక్రమించుకుందని, డ్రైనేజీ పై రాంప్ ఎందుకు కట్టారని హోటల్ యజమానితో వాగ్వాదానికి దిగారు. దానిని తొలగిస్తామని పేర్కొన్నారు. దీంతో అధికారి.. హోటల్ యమమాని మధ్య వాదన జరిగింది.
దీంతో చేసేదేమీ లేక ఆ హోటల్ యజమాని జేసీబీ ముందు పండుకొని నిరసన తెలిపారు. నా పైనుంచి ఎక్కించి ర్యాంప్ కూల్చాలని నిరసన తెలిపాడు.. నగరమంతా డ్రైనేజీ లపై ఈ విధంగానే ఉన్నాయని.. తాను ఒక్కడినే దానికి సమస్య కాదు.. అంటూ హోటల్ యజమాని అధికారులతో వాదించారు..
దీంతో చేసేదేమీ లేక ఆ మున్సిపల్ అధికారి వెనక్కి తగ్గక తప్పలేదు. దీనికి సంబంధించిన వీడియోలన్నీ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రొద్దుటూరులో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.. ఈనెల నాలుగవ తేదీన ఈ సంఘటన చోటుచేసుకుంది
Also read
- ఫుల్గా తాగాడు.. నీట్గా ట్రాన్స్ఫార్మర్ ఎక్కాడు.. సీన్ కట్చేస్తే.. ఇది పరిస్థితి!
- Rare Raj Yogas: మహా శివరాత్రి నాడు 3 రాజయోగాలు.. ఈ రాశుల వారికి మహార్ధశకు మించిన లాభాలు..!
- Maha Shivaratri: మహాశివరాత్రి.. ఈరోజు శివుడికి ఆగ్రహం తెప్పించే ఈ తప్పులు అస్సలు చేయొద్దు
- Namakkal Hanuman Temple: రోజురోజుకీ పెరుగుతున్న ఆంజనేయ స్వామి.. ఈ ప్రత్యేక ఆలయం ఎక్కడ ఉందో తెలుసా.?
- నేటి జాతకములు…9 ఫిబ్రవరి, 2026





