మట్టెవాడ: వరంగల్లో విషాదం చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణిగా ఉన్న వైద్యురాలు మృతిచెందారు. మట్టెవాడ ఎస్సై శివకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటకలోని గుల్బర్గా జిల్లా చించోలి మండలం బత్తంపల్లికి చెందిన ఎస్. మమతారాణి వైద్యురాలిగా పనిచేస్తున్నారు. నగరంలోని హంటర్రోడ్డులోని ఫాదర్ కొలంబో ఆస్పత్రిలో జనరల్ మెడిసిన్ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్నారు. గతేడాది నారాయణపేట జిల్లాకు చెందిన డాక్టర్ రాఘవేంద్రతో ఆమెకు వివాహం జరిగింది.
సోమవారం రాత్రి విధులు ముగించుకొని భర్తతో కలిసి హంటర్ రోడ్డు మీదుగా బైక్పై ఇంటికి బయల్దేరారు. మార్గమధ్యలో ఏడు మోరీల కూడలి వద్దకు రాగానే వెనక నుంచి వచ్చిన టిప్పర్ వారి బైక్ను ఢీకొట్టింది. దీంతో భార్యాభర్తలు కింద పడిపోయారు. 9 నెలల గర్భిణిగా ఉన్న మమతా రాణి తీవ్రంగా గాయపడటంతో స్థానికుల సహాయంతో భర్త నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతిచెందారు. టిప్పర్ డ్రైవర్ అన్సారీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిని ఝార్ఖండ్కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Also read
- పోలీస్ స్టేషన్లో కాల్పుల కలకలం.. AK-47తో కాల్చుకుని ఎస్ఐ ఆత్మహత్యాయత్నం!
- మధ్యాహ్న భోజన పథకం కార్మికుల పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి….. గ్రీష్మ కుమార్, ఐ.యఫ్టియు రాష్ట్ర కమిటీ సభ్యులు.
- Ganesh Chaturthi: గణేశుడికి ఏనుగు తల ఎలా వచ్చింది? గజాసురుడి తలనే ఎందుకు పెట్టారు.. అసలు కథ ఇదే!
- భాద్రపద మాసం.. వినాయక చవితి నుంచి మహాలయ అమావాస్య వరకు.. ఈ మాసంలోని పండగలివే!
- వినాయక చవితి వేళ అద్భుత గ్రహ యోగాలు.. ఈ రాశుల వారికి గణపతి ఆశీస్సులతో పట్టిందల్లా బంగారమే!





