ఎమ్మిగనూరు వ్యవసాయం, న్యూస్టుడే: కర్నూలు జిల్లాలో పాత కక్షలు భగ్గుమన్నాయి. తమ వర్గం వారిని హత్య చేశారని.. ప్రత్యర్థి వర్గానికి చెందిన వారిపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఎమ్మిగనూరు మండలంలోని కందనాతిలో వెంకటేశ్ (40), పరమేశ్ (35)ను ప్రత్యర్థులు దారుణంగా హతమార్చారు. మరొక వ్యక్తి గోవింద్ ప్రత్యర్థుల దాడిలో తీవ్రంగా గాయపడ్డాడు. వీరికి.. రెండేళ్ల క్రితం హత్యకు గురైన వర్గం వారికి వర్గపోరు నడుస్తోంది. గతంలో ఊరు వదిలి వెళ్లిపోయిన వైరి వర్గంవారు తిరిగి వచ్చారు. ఎప్పట్నుంచో వారి కోసం ఎదురు చూస్తోన్న ప్రత్యర్థులు పొలంలో పరమేశ్ను హత్య చేశారు. వెంకటేశ్ ను గ్రామంలో చంపేశారు. గోవింద్ పొలం నుంచి వస్తుండగా వేటకోడవళ్లతో దాడి చేయగా.. తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు. సంఘటనాస్థలానికి డీఎస్పీ భార్గవి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.
Also Read
- తడకల మాటున చాటుమాటు యవ్వారం.. తొంగిచూసిన స్థానికుల మైండ్ బ్లాక్!
- కేసరపల్లి శ్రీ చైతన్య కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య
- రాత్రి పడుకుని.. ఉదయం లేచి చూసేసరికి ఆ కాలనీలోని కార్లన్నీ ఇలానే
- ప్రియురాలిని చంపి.. భర్తకు ఫోన్ చేసిన ప్రియుడు..!
- తెలంగాణ : పెద్దలను ఎదిరించి ప్రేమ పెళ్లి చేసుకున్నారు.. కట్ చేస్తే మూడు కార్లలో వచ్చి..





