కామారెడ్డి జిల్లాలో ఘటన
బీర్కూర్: బిడ్డలను పోషించలేక తండ్రి ఆత్మహత్య చేసుకున్న ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. బీర్కూర్ మండలం వీరాపూర్నుబ్బాకు చెందిన ప్రహ్లాద్ (30) అనే వ్యక్తికి అదే గ్రామానికి చెందిన సౌందర్యతో పదేళ్ల కిందట వివాహమైంది. వీరికి ముగ్గురు కుమార్తెలు స్నేహ (8), హర్షిత (6), వసుంధర (4) ఉన్నారు. ప్రహ్లాద్ రోజూవారీ కూలీ పని చేస్తూ కుటుంబాన్ని పోషించేవారు. తనకు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారని. వారిని ఏ విధంగా చదివించి, వివాహాలు చేయాలని బాధపడేవారు.
ప్రస్తుతం సౌందర్య 9 నెలల గర్భిణి. ఈ నెల 26 లోపు కాన్పు అవుతుందని వైద్యులు తెలిపారు. నాలుగో సంతానం కూడా కుమార్తె జన్మించొచ్చనే భయంతో శనివారం మధ్యాహ్నం ఇంట్లో కుటుంబ సభ్యులు చూస్తుండగానే విష ద్రావకం తాగారు. కుటుంబీకులు వెంటనే అతన్ని చికిత్స నిమిత్తం బాన్సువాడ ప్రాంతీయ దవాఖానాకు తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్ జీజీహెచ్కు తీసుకెళ్లారు అక్కడ చికిత్స పొందుతూ అదే రోజు రాత్రి మృతి చెందారు. ఆదివారం మృతదేహానికి శవ పరీక్ష చేసి కుటుంబీకులకు అప్పగించారు. భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు వివరించారు. కాగా ప్రహ్లాద్ గతంలోనూ మూడు సార్లు ఆత్మహత్యకు యత్నించగా.. కుటుంబీకులు కాపాడారు.
Also read
- ఓర్నీ దుంపదెగ.. SIR వెరిఫికేషన్ పేరిట వచ్చి పుస్తెల తాడు తెంపుకుపోయిండ్రు!
- Ananthagiri Hills: అనంతగిరిలో ట్రెక్కింగ్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిన మహిళ.. ఆ తర్వాత నిమిషాల్లోనే..
- భాగ్య, హన్నమ్మ మామూలు లేడీస్ కాదమ్మ.. బస్టాండ్లో వాళ్ల కంట పడ్డారో అంతే సంగతులు..
- కుక్కలను చంపే ఇంజెక్షన్ ఇచ్చి బావను చంపిన బావమరిది..! క్రైమ్ స్టోరీని మించిన స్కెచ్..
- ఆరు హత్యకేసుల నిందితుడు రాజ్ కుమార్ మృతి





