సాధారణంగా బంగారమో, డబ్బో ఎత్తుకెళ్లే వారిని మనంచూస్తుంటాం. కానీ పూలను దొంగతనం చేసేవాళ్లను మీరెప్పుడైనా చూశారా.. అది కూడా స్మశానంలో సమాధులపై ఉన్న పూలను ఎత్తుకెళ్లే వాళ్లను చూశారా. అయితే ఇప్పుడు చూడండి. తమవారి ఆత్మశాంతి కోసం జనాలు సమాధిపై పూలు పరిచి వెళ్ళిపోతుంటే.. ఓ ప్రబుద్ధుడు వాటిని ఏరుకుంటూ మూటగట్టుకోవడాన్ని స్థానికులు గమనించి ఆ దృశ్యాలను ఫోన్లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. దీంతో ఇందుకు సంబంధించిన వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ ఘటన హైదరాబాద్లో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ నగరం పాతబస్తీ ప్రాంతంలోని మొగల్పుర పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ వింత ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న ఓ ప్రముఖ శ్మశానంలో సమాధులపైన ఉన్న పూలను దొంగతనం చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో కూడా వైరల్ అవుతుంది. ఈ వీడియోలో ఓ వ్యక్తి ఓ సమాధిపై కూర్చుని ఆ ప్రాంతమంతా శుభ్రం చేశాడు. ఆ తర్వాత సమాధిపై ఉన్న పూలను తీసుకుని మూట గట్టుకున్నాడు. శుభ్రం చేసుకునే వరకు బాగానే ఉంది.. కానీ అక్కడ ఉన్న పూలు ఎందుకు తీసుకెళ్లాడనేది అర్థం కావట్లేదని నిర్వాహకులు చెబుతున్నారు.
పైగా సమాధి అంటే ఒక రకంగా ఎవరైనా భయపడతారు.. అరిష్టం అని భావిస్తారు. అలాంటిది సమాధిపై ఉన్న పూలు తీసుకెళ్లడం ఏంటని అంతా ఆశ్చర్యపోతున్నారు. ఏది ఏమైనా ఇందుకు సంబంధించిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసిన జనాలు ఆ వ్యక్తి ఆ పువ్వులను మళ్లీ అమ్మడు కదూ అని కామెంట్స్ చేస్తున్నారు.
Also Read
- ఆదివారం తులసి మొక్కకు నీరు పోయకూడదని ఎందుకు అంటారు? నిజం తెలుసుకోండి!
- Astro Secrets: మీ రాశిని శాసించే ఆ జంతువు ఏంటో మీకు తెలుసా?.. జ్యోతిష్య శాస్త్రంలో దాగి ఉన్న ఆసక్తికరమైన రహస్యాలివే!
- Weekly Horoscope: వారికి అదృష్టం కలిసి రానుంది..! 12 రాశులకు వారఫలాలు
- నువ్వేం మనిషి అంజయ్య.. అత్తగారు బైక్ కొనిపెట్టలేదని.. భార్యను చంపి..
- రైల్వే స్టేషన్కు వెళ్తుండగా విరుచుకుపడ్డ మృత్యువు..భార్య, కొడుకు కళ్లెదుటే భర్త దుర్మరణం! ఏం జరిగిందో చూస్తే..





