అల్లూరి జిల్లా అరకు ఏజెన్సీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కలువ పూలు కోసేందుకు వెళ్లి ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఇంటి నుంచి వెళ్లిన యువకుడు.. ఎంతకీ ఇంటికి రాకపోయేసరికి కుటుంబం ఆందోళన చెందింది. వెతికేసరికి గుండె పగిలే ఘటన కళ్ళ ముందు కనిపించింది. డుంబ్రిగూడ మండలం నందివలసలో ఘటన జరిగింది.
అల్లూరి జిల్లా అరకు ఏజెన్సీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కలువ పూలు కోసేందుకు వెళ్లి ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఇంటి నుంచి వెళ్లిన యువకుడు.. ఎంతకీ ఇంటికి రాకపోయేసరికి కుటుంబం ఆందోళన చెందింది. వెతికేసరికి గుండె పగిలే ఘటన కళ్ళ ముందు కనిపించింది. డుంబ్రిగూడ మండలం నందివలసలో ఘటన జరిగింది.
చెరువులో కలువ పూలు కోసేందుకు వెళ్లిన గిరి యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. డుంబ్రిగూడ మండలం అరమ పంచాయతీ డుంబ్రివలస గ్రామానికి చెందిన పాంగి సంజీవరావు.. కలువ పూలు కోయాలని అనుకున్నాడు. గ్రామానికి సమీపంలోని నందివలస చెరువులో కలువ పూలు తెంచేందుకు దిగాడు. చెరువులోకి వెళ్ళగానే ఊబిలో చిక్కుకున్నాడు. కాళ్ళు ఊబిలో చిక్కుకుని బయటకు రాలేకపోయాడు.
ఇదిలావుంటే ఇంటి నుంచి వెళ్లిన ఆ యువకుడు.. ఎంతసేపైనా తిరిగి రాకపోయేసరికి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కంగారుపడ్డారు. ఊరంతా గాలించారు. ఎక్కడా ఆచూకీ లేదు. చివరికి చెరువు గట్టున దుస్తులు కనిపించాయి. గుండెలు పట్టుకుని.. చెరువులో గాలించారు. గుండె పగిలే అదృశ్యం వాళ్లకు కనిపించింది. ఊబిలో ఊపిరాడక ప్రాణాలు కోల్పోయి విగతజీవిగా మారాడు సంజీవరావు. గ్రామస్తులు మృతదేహాన్ని ఒడ్డుకు తీసుకువచ్చారు. చేతికంది వచ్చిన యువకుడి మృతితో ఆ కుటుంబంలో తీవ్ర విషాదంలోకి వెళ్లింది. సంజీవరావు తల్లి చిన్నప్పుడే మృతి చెందగా.. తండ్రి అప్పలస్వామి కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు
Also read
- చెంబులో ‘కీ’… అదే కలిసొచ్చింది దొంగలకి
- ఫేస్ బుక్ లో వల.. సహజీవనం తర్వాత అసలు రంగు!
- భర్త కువైట్లో.. భార్య కడపలో.. డ్రైవర్తో అలా కనిపించే సరికి..
- విశాఖ ప్రమాద బాధితులకు కోటిరూపాయల పరిహారం ఇవ్వాలి…… గ్రీష్మ కుమార్ ఐ.యఫ్.టీ.యు రాష్ట్ర కమిటీ సభ్యులు.
- భార్యభర్త మధ్యలో ప్రియుడు.. ఆయన లేడని ఇంటికి పిలిచింది.. తర్వాతి సీన్ ఇదే..





