నార్సింగి మున్సిపాలిటీ పరిధిలోని మంచిరేవుల రాధ రియల్టర్ వెంచర్లో ఒక ప్లాట్కు ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (LRS) క్లియరెన్స్ ఇచ్చేందుకు మణిహారిక రూ.10 లక్షలు డిమాండ్ చేసింది. ఈ క్రమంలో రూ.4 లక్షలు లంచం తీసుకోవడంతో ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
నార్సింగి మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారిణిగా ఉన్న మణిహారిక ఏసీబీ వలలో పడింది. నార్సింగి మున్సిపాలిటీ పరిధిలోని మంచిరేవుల రాధ రియల్టర్ వెంచర్లో ఒక ప్లాట్కు ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (LRS) క్లియరెన్స్ ఇచ్చేందుకు మణిహారిక రూ.10 లక్షలు డిమాండ్ చేసింది. ఈ క్రమంలో రూ.4 లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. వినోద్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు ఈ ఆపరేషన్ నిర్వహించారు. ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయంలో ప్రస్తుతం సోదాలు కొనసాగుతున్నాయి. అయితే ఈ మధ్య కాలంలో అధికారులు లంచాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
Also read
- షాకింగ్: కన్నకూతురే రాసిన రక్తచరిత్ర
- అయ్యో జానూ.. పోలీసుల కీలక నిర్ణయం
- గంగమ్మ కస్టోడియల్ డెత్ కేసు ట్విస్ట్.. హైకోర్టు కీలక ఆదేశాలు
- భర్త గొంతు నులిమి చంపిన భార్య
- గుంటూరులో అమానవీయ ఘటన





