*సనాతన ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత అన్ని జాతులు,వర్గాల పైన ఉంది…. శ్రీశ్రీశ్రీ వామనాశ్రమ మహాస్వామి*
అమరావతి:
వైశ్య కుల గురువు, శృంగేరి పీఠ శిష్య పరంపర, పరమపూజ్య శ్రీశ్రీశ్రీ వామనాశ్రమ మహా స్వామిజీ వైశ్య గురు మఠం వారణాసి మరియు హల్దీపూర్, కర్ణాటకకు చెందిన స్వామీజీ
శ్రీ విశ్వావసు నామ సంవత్సర 22వ చాతుర్మాస్య వ్రతం సందర్భంగా గుంటూరు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో చాతుర్మాస దీక్ష సందర్భంగా దేవాలయంలో కొలువై ఉన్నారు. వారి కరపద్మములతో శ్రావణ శుక్రవారం రోజున బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ శర్మకు దుశాల్వాతో సత్కరించి మహా ఆశీర్వాదం అందజేశారు. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ సనాతన ధర్మాన్ని, దేవాలయ వ్యవస్థను కాపాడాల్సిన బాధ్యత బ్రాహ్మణ వైశ్య కులాలపై ఎంతైనా ఉందని, సనాతన ధర్మాన్ని కాపాడటంలో ఈ ఇరు జాతులు పురాణ కాలం నుంచి ముఖ్య భూమిక పోషిస్తున్నారని, ఈ నవ నాగరిక సమాజంలో కూడా ఇద్దరు అన్నదమ్ముల వలె కలిసిమెలిసి సనాతన ధర్మాన్ని కాపాడుతున్నారని, అలానే మిగిలిన జాతులు వారు కూడా సనాతన ధర్మం పట్ల దేవాలయాల పట్ల మక్కువ చూపేలా చిన్ననాటి నుండే ఆధ్యాత్మిక చింతనను వారి వారి పిల్లలకు అలవాటు చేయాలని, ఈ సనాతన ధర్మాన్ని భవిష్యత్ తరాలకు అందేలా సమాజంలో ఉన్న అన్ని జాతులు, వర్గాలు కృషి చేయాలని స్వామీజీ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ నిడమానూరు సురేష్, రవి, బొడ్డుపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Also read
- ఎంత కష్టమొచ్చిందో.. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి.. లెటర్ రాసి మరీ ఇలా..
- అయ్యో రేవతి.. కొడుకుకు ఈత నేర్పాలనుకుంది.. ఈలోపే ఏమైందంటే..
- మళ్లీ రెచ్చిపోయిన బాపట్ల రైలు దొంగల ముఠా.. అర్ధరాత్రి కాల్పులు జరిపిన రైల్వే పోలీసులు!
- పసికందు విక్రయ ఆరోపణలు కలకలం.. తల్లి అంగీకారంతో కేసులో కొత్త ట్విస్ట్
- రూ.33 లక్షల బకాయి బిల్లు కోసం బడికి తాళం.. రోడ్డున పడ్డ విద్యార్థులు, ఉపాధ్యాయులు!





