SGSTV NEWS
Andhra PradeshCrime

నెల రోజుల్లో పెళ్లి.. కిలో బంగారం, 3 కిలోల వెండి, పట్టుచీరలు, రూ.20 లక్షలు దోపిడి



Visakhapatnam Robbery: విశాఖా లో భారీ
దొంగతనం జరిగింది. షీలా నగర్ వెంకటేశ్వర కాలనీలో ఎల్ఎసిలో పనిచేస్తున్న శ్రీనివాస్ అనే వ్యక్తి ఇంట్లో దొంగలు చోరీ చేశారు. కేజీ బంగారం, మూడు కేజీల వెండి 20 లక్షల డబ్బు పట్టు చీరలు దొంగిలించారు. అంతే కాకుండా ఇల్లు మొత్తం చిందరవందలు చేసి పరారయ్యారు.

పెళ్లి పూట చోరీ – కుటుంబం విషాదంలో

కుమార్తె పెళ్లి కోసం బంగారు నగదు తీసుకొచ్చి ఇంట్లో పెట్టామని.. చోరీ జరగడంతో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి ఉన్నామంటున్నారు ఇంటి యజమాని శ్రీనివాస్. ఇది మా ఇంట్లో మొదటిసారి కాదు. గతంలో కూడా ఒకసారి చిన్నగా దొంగతనం జరిగింది. కానీ ఈసారి మాకు చాలా నష్టం జరిగింది. మనసు తెరచి చెప్పలేకపోతున్నాం, అంటూ బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు.



సీసీ కెమెరాలు కీలకం కానున్నాయా?

చోరీ జరిగిన ఇంటితో పాటు పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాలు ఆధారంగా.. పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కొన్ని దృశ్యాల్లో ముగ్గురు అనుమానితుల భౌతిక స్వరూపాలు స్పష్టంగా రికార్డయ్యాయని గాజువాక సీఐ శ్రీనివాసరావు వెల్లడించారు. క్లూస్ టీమ్ సాయంతో సాక్ష్యాలను సేకరించి, ప్రత్యేక బృందాలతో దొంగలను పట్టుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

ముందస్తు రికీతో పథకం?

ఈ దొంగతనానికి ముందే పక్కా పథకం వేశారు. ఇంట్లో ఎవరెవరుండబోతున్నారో, పెళ్లి తంతు కోసం ఎప్పుడు ఖాళీగా ఉంటుందో ముందుగానే గమనించి.. ఈ దాడికి పాల్పడ్డట్టుగా తెలుస్తోంది. ఇంటి తాళాలు, లాకర్ ఎక్కడుందో, ఏ వస్తువులున్నాయో అన్ని సమాచారం వున్నట్టుగా.. వారి చర్యలు స్పష్టంగా సూచిస్తున్నాయి.

పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది

ఇప్పటికే బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు, దొంగల పట్ల కీలక ఆధారాలు సేకరిస్తున్నారు. కాలనీలోని మిగతా నివాసదారులకు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. అంతేకాకుండా రాత్రి వేళలలో ప్రైవేట్ సెక్యూరిటీ, నైట్ పెట్రోలింగ్ పెంచనున్నారు.

భద్రత పట్ల అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి

ఈ ఘటన నేపథ్యంలో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. తమ ఇండ్ల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనితో, పోలీసు శాఖ ప్రజలకు కొన్ని సూచనలు చేసింది

– సీసీ కెమెరాలను ఇంటి చుట్టూ ఏర్పాటు చేయాలి.

ఇంట్లో ఎవరు లేని సమయంలో.. పొరుగువారిని సమాచారం ఇవ్వాలి.

విలువైన వస్తువులను బ్యాంకుల్లో భద్రపరచాలి.

అనుమానాస్పద వ్యక్తులను గమనిస్తే.. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి.

షీలానగర్లో జరిగిన ఈ భారీ దొంగతనం కేసు.. విశాఖ నగర వాసుల్లో భయాన్ని కలిగించినప్పటికీ, పోలీసులు చేసిన వేగవంతమైన స్పందన ప్రశంసనీయం. ప్రస్తుతం దర్యాప్తు తుది దశలో ఉన్నట్లు సమాచారం. ముగ్గురు ప్రొఫెషనల్ దొంగలను పట్టుకునేందుకు.. పోలీసులు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. ఈ సంఘటన మరోసారి ఇంటి భద్రతపై ప్రజల్లో జాగ్రత్త అవసరమని గుర్తు చేస్తోంది.

Also read

Related posts

Share this