గుంటూర్ జిల్లాలో మరో రైలు దోపిడి ప్రయత్నం జరిగింది. పిడుగురాళ్ల తుమ్మల చెరువు వద్ద విశాఖ ఎక్స్ ప్రెస్లో కొంతమంది దుండగులు చోరీకి ప్రయత్నించారు
Train: గుంటూర్ జిల్లాలో మరో రైలు దోపిడి ప్రయత్నం జరిగింది. పిడుగురాళ్ల తుమ్మల చెరువు వద్ద విశాఖ ఎక్స్ ప్రెస్లో కొంతమంది దుండగులు చోరీకి ప్రయత్నించారు. దీంతో వెంటనే అప్రమత్తమైన రైల్వే పోలీసులు దొంగలపై కాల్పులు జరిపిపారు. మూడు రౌండ్లు కాల్పులు జరపడంతో అక్కడినుంచి పారిపోయారు.
వారిని పట్టుకునేందుకు ప్రయత్నించగా దొరకుండా పారిపోవడంతో వారికోసం గాలిస్తున్నారు. వరుసగా రైళ్ళలో చోరికి పాల్పడుతున్న వారిని బీహార్, మహారాష్ట్ర గ్యాంగ్ లుగా అనుమానిస్తున్నారు. ఈ ముఠాలో ఏడుగురు సభ్యులున్నట్లు గుర్తించారు. వారం రోజుల్లో రెండుసార్లు తెల్లవారుజామునే చోరికి పాల్పడేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు వెల్లడించారు.
Also read
- సోమవారం శివారాధన ఇలా చేస్తే శివకటాక్షం.. భక్తితో చేసే ఈ పూజతో శుభఫలితాలు పొందండి!
- ఈ రాశుల వారు పెట్టి పుట్టారు.. కోరుకున్నది జరిగే సమయం ఆసన్నం.. మీరున్నారా?
- Hyderabad: ప్రేమ పేరుతో వల.. ఐదుగురు యువతులతో వ్యవహారం.. మైనర్పై దారుణం!
- నాన్న నేనేం తప్పు చేశాను.. ఎందుకు నన్ను చంపేశావ్.. ఒంగోలులో గుండెల్ని పిండేసే ఘటన..
- జర్నలిస్ట్ ఆత్మహత్య.. సెల్ఫీ వీడియో కలకలం





