నడిరోడ్డుపై తాగుబోతు చేసిన పనితో వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. అందరూ అతడిని ఫోటోలు, వీడియోలు తీసి నెట్టింట వైరల్గా మార్చేశారు. దాంతో ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఒళ్లు తెలియకుండా ఫుల్గా మద్యం తాగిన అతడు..మందు మైకంలో నాకెవరు అడ్డు చెప్పేది.. నన్ను ఎవరు ఆపేది అన్నట్టుగా నడి రోడ్డుపై స్కూటీని పడేశాడు. అలాగే, గుర్రుపెట్టి నిద్రపోయాడు.
మందుబాబులా మజాకా.. తాగిన మందు నషాళానికి ఎక్కిన తరువాత వాళ్లు చేసే రచ్చ మామూలుగా ఉండదు. కొందరు తాగేసి గొడవలు సృష్టిస్తారు. మరికొందరు ఎత్తైన టవర్లు, స్తంబాలు ఎక్కేస్తుంటారు. మరికొందరు ప్రమాదాల బారినపడుతుంటారు. ఇంకొందరు ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. ఇక విజయవాడలో నడి రోడ్డుపై ఓ మందుబాబు చేసిన రచ్చ ఎలా ఉందంటే.. ఫుటుగా తాగేసిన అతడు..తన స్కూటీని అక్కడే వదిలేసి నడిరోడ్డుపైనే హాయిగా గుర్రుపెడుతున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
ఈ ఘటన విజయవాడలోని శ్రీనగర్ కాలనీలో జరిగింది. నడిరోడ్డుపై తాగుబోతు చేసిన పనితో వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. అందరూ అతడిని ఫోటోలు, వీడియోలు తీసి నెట్టింట వైరల్గా మార్చేశారు. దాంతో ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఒళ్లు తెలియకుండా ఫుల్గా మద్యం తాగిన అతడు..మందు మైకంలో నాకెవరు అడ్డు చెప్పేది.. నన్ను ఎవరు ఆపేది అన్నట్టుగా నడి రోడ్డుపై స్కూటీని పడేశాడు. అలాగే, గుర్రుపెట్టి నిద్రపోయాడు. అటు, ఇటుగా ఎన్ని వాహనాలు రోడ్డుపై వెళ్తున్న అతని నిద్రకు మాత్రం భంగం కలగలేదు
వీడియో ఇక్కడ చూడండి..
Also read
- సూర్య గోచారం.. 12 రాశులపై దీని ప్రభావం ఎలా ఉండనున్నదంటే?
- June Amavasya 2026: అమావాస్య నుంచి వీరికి మహర్దశ..! ఇందులో మీ రాశి ఉందా..?
- చెన్నూరు SBI గోల్డ్ చోరీ కేసు సుఖాంతం.. ఎట్టకేలకు బంగారం తిరిగి అందజేసిన బ్యాంక్
- రాత్రిళ్లు ఇళ్లను టార్గెట్ చేస్తున్న దొంగ బాబు.. బాలెనో కారులో వచ్చి చోరీలు!
- 9 ఏళ్ల తర్వాత సంచలన తీర్పు.. కంచర్ల శ్రీను హత్య కేసులో 13 మందికి జీవిత ఖైదు!





