జ్యోతిష్యం ప్రకారం జూన్ నెల చాలా కీలకమైన నెల. ఈనెల ఐదోతేదీన దేవతల గురువైన బృహస్పతి, రాక్షకుల గురువైన శుక్రుడు కలుసుకుంటున్నారు. వీరిద్దరూ 60 డిగ్రీల కోణంలో ఉండటంవల్ల విశిష్టమైన సంయోగం ఏర్పడుతోంది. దీనివల్ల మూడు రాశులవారికి అనేక ఆర్థిక లాభాలు కలుగుతున్నాయి. సంపదకు, విలాసవంతమైన జీవితానికి శుక్రుడు కారకుడైతే, ఆధ్యాత్మికతకు, సంతానానికి, వివాహానికి గురువు కారకుడవుతాడు. వీరిద్దరూ కలిసి ఏయే రాశులకు ఏవిధంగా లాభాలు తెచ్చిపెడుతున్నారో చూద్దాం.
కుంభ రాశి
గురువు, శుక్రుడు కలిసి ఏర్పరుస్తున్న యోగంవల్ల ధనలాభం కలుగుతుంది. దీనివల్ల ఈ రాశివారి సంపాదన పెరుగుతుంది. ఆర్థిక సమస్యలన్నీ తీరిపోతాయి. ఉద్యోగస్థులకు పదోన్నతి ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగాలొస్తాయి. విదేశాలకు వెళ్లాలనుకునేవారికి కొంచెం గట్టిగానే ప్రయత్నించాలి. నవగ్రహాలకు ప్రదక్షిణ చేయడంతోపాటు గురువును, శుక్రుడిని పూజించాలి.
ధనుస్సు రాశి
ఒకరకంగా ఈ రాశివారికి బంగారు రోజులు ప్రారంభమయ్యాయని చెప్పొచ్చు. విదేశాలకు వెళ్లాలనుకొని ఎంతోకాలం నుంచి ప్రయత్నిస్తున్నవారి కోరిక ఇప్పుడు నెరవేరుతుంది. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఇప్పుడు రాబడి రావడం ప్రారంభమవుతుంది. కొన్ని సంవత్సరాల తర్వాత పాత మిత్రులను కలుసుకుంటారు. కొత్త ప్రాజెక్టును ప్రారంభించి అందులో సంపూర్ణమైన విజయాన్ని సాధిస్తారు. దీనివల్ల మంచి పేరు తెచ్చుకుంటారు.
తులా రాశి
గతంలో మొదలై నిలిచిపోయిన పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి. అనుకున్న సమయంలోనే విజయం సాధిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు రావడంతోపాటు ఉద్యోగం చేస్తున్నవారికి కొత్త అవకాశాలు వస్తాయి. గతంలోకంటే ఇప్పుడు మానసికంగా ఎంతో ప్రశాంతంగా జీవనాన్ని కొనసాగిస్తారు. ఎదుటివారితో మాట్లాడే సమయంలో ఈ రాశివారు కొంత జాగ్రత్త పాటిస్తే మేలు కలుగుతుంది. లేదంటే వివాదాలు రేకెత్తే అవకాశం ఉంది.
Also read
- Vijayawada:పోలీస్ ల నుండి తప్పించుకునేందుకు.. అపార్ట్మెంట్ పైనుంచి దూకేసిన యువకుడు
- Guntur: కాల్ బాయ్గా చేస్తే సూపర్ ఇన్కం.. టెమ్ట్ అయి కమిటయిన కొందరు.. ఆ తర్వాత
- Hyderabad: చదువుకోమని తల్లి మందలించిందని..
- Crime News: కరీంనగర్లో దారుణం.. బాలికపై గ్యాంగ్ రేప్.. ఆపై వీడియో తీసి..
- BIG BREAKING: తెనాలిలో కలకలం.. పట్టపగలు నడిరోడ్డుపై దారుణ హత్య!