ప్రేమ పేరుతో మోసానికి వంచనకు గురయ్యాను.. నాకు న్యాయం చేయండి అని స్పందనలో పల్నాడు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు
ఏఆర్ కానిస్టేబుల్, దుర్గాప్రసాద్ ఇరువురు కూడా నన్ను బాగా ఇబ్బంది పడుతున్నారు
సీఎం గారు,.పవన్ గారు, లోకేష్ గారు నాకు న్యాయం చేయండంటూ వీడియో
చిలకలూరిపేట : నా పేరు సోడిశెట్టి మంజు భార్గవి మాది చిలకలూరిపేట నియోజకవర్గం లోని నాదెండ్ల మండలం ఇర్లపాడు గ్రామం.నా చదువు నిమిత్తం నానమ్మ గారి ఊరైన అద్దంకి కి వెళ్ళి చదువు కొనే సమయంలోఅద్దంకి పట్టణం లోని విశ్వ భారతి జూనియర్ ఇంటర్ కాలేజీ డైరెక్టర్ మాకు దూరపు బంధువు నాకు వరస అయ్యేసోడిశెట్టిరామానాయుడునన్నుప్రేమిస్తున్నానను అని నా వెంట పడి పెళ్ళి చేసుకుంటానని మాయ మాటలు చెప్పి నన్ను లొంగదీసుకుని వాడుకొని గర్భవతిని చేసి తనతో పెళ్లి చేసుకోకుండా. అధిక కట్నం స్థిరస్తులకు ఆశపడి నన్ను మోసం చేసి వేరొకరితో పెళ్ళికి సిద్ధమైన సమయంలో నాకు న్యాయం చేయమని తేదీ : 8_2_2022 నరసరావు పేట దిశ పోలీసు స్టేషన్ లో కేసు పెట్టగా ఆ సమయంలో అతని తల్లి సోడిశెట్టి వెంకటసుబ్బమ్మ, వారి బంధువులు ధర్మవరపు దుర్గాప్రసాద్, మేకల నరేంద్ర (ఏ.ఆర్. కానిస్టేబుల్) అను వారు వచ్చి నాకు అతనితో పెండ్లి చేస్తామని నమ్మించి తీసుకువెళ్లినారు. వారు మాకు బంధువులు కావడంతో వారి మాటలు నమ్మి నేను వారితో వెళ్లగా సదరు మా అత్తగారైన సోడిశెట్టి వెంకటసుబ్బమ్మ, మిగిలిన వారునాకు మాయమాటలు చెప్పి గర్భవతిని చేసిన రామానాయుడు నీకంటే చాలా పెద్దవాడని అతనికి బదులుగా అతని తమ్ముడు అయిన సోడిశెట్టి కామేశ్వరరావుకు ఇచ్చి పెళ్లి చేస్తామని అతను నీకు ఏ లోటు లేకుండా చూసుకుంటాడని మాది బాధ్యత అని చెప్పిన , అందుకు నేను అంగీ కరించలేదు అయిన నా మాటలు వినకుండా ఆ అమ్మాయి పెళ్లి ఆగితే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తుంది
మన ఇరు కుటుంబాల పరువు పోతుందని , అందరూ బంధువులు కలసిబలవంతంగా బెదిరించి నన్ను ఒప్పించి , రామానాయుడు సోదరుడు కామేశ్వరరావు తో కుటుంబ సభ్యులు గ్రామ పెద్దల సమక్షంలో గుడిలో వివాహం చేయటం జరిగింది, పెండ్లి అయినా తర్వాత మూడు రోజులు ఇర్ల పాడు గ్రామంలో మా ఇంట్లో ఉన్న తర్వాత ఇరువురు కలసి అద్దంకి వచ్చినాము ,16 రోజుల పండుగ నాటికి వస్తాను అని మా వారు చెప్పి వెళ్ళిన తర్వాత , నన్ను మోసగించిన రామ నాయడు నాతో అసభ్యకరంగా వాట్స్ అప్ మెసేజ్ లు పెడుతూ నేనే నీకు దిక్కు వాడు రాడు నిన్ను నేను చూసుకుంటా నా మాట విను అని మెసేజ్ లు పెడుతు మానసికంగా మెంటల్ టార్చర్ చేస్తున్న క్రమంలో మావారి కి ఫోన్ చేసి విషయం చెప్పగా నువ్వు మా అన్నయ్య గురించి ఏమి చెప్పినా వినను నీకు తగిన శాస్తి చేశాము అని ఫోన్ పెట్టినాడు. మా అత్తయ్యకు విషయం చెపితే నాకు తెలియదు, వాడికి నువ్వు అంటే ఇష్టము లేదు, ఏమి చేసుకుంటావో చేసుకో నీకు దిక్కు ఉన్న చోట చెప్పుకో అంటూ బెదిరించినారు.
నేను చేయగలిగింది ఏమి లేక నాపుట్టిల్లుu అయిన ఇర్లపాడు గ్రామము వచ్చి పెద్ద వాళ్ళతో చెప్పగా మా అత్తింటి వారితోపెద్దమనుషులతో పలు మార్లు మాట్లాడగా వాడు ఎక్కడ ఉన్నాడో మాకు తెలియదు వెతుకుతున్నాం అని 14 నెలలు అదిగో ఇదిగో అంటూ కాల యాపన చేస్తున్న క్రమంలో 27_ 4 2023 తేదీన నన్ను మా తల్లి దండ్రులు మా అమ్మ తమ్ముళ్ళు తీసుకొని అత్తవారింటికి తీసుకెళ్ళి అత్తయ్య బంధువుల తో మాట్లాడి మీ అబ్బాయి వచ్చే వరకు అమ్మాయి ఇక్కడే ఉంటుందని అప్పటి వరకు మా తల్లి గారు నాతోనే ఉంటుందినీ బంధువులు అత్తవారి చెప్పే వెళ్ళినారు. మా అత్తగారి ఇంట్లో నిద్రపోయి తెల్లవారి నిద్ర లేవంగానే మా అత్తయ్య చెప్పాపెట్టకుండా ఇల్లు వదలి వెళ్ళినారు.నాటినుండి నేను మా అమ్మ అక్కడే ఉంటున్నాము.అయిన కానీ రామ నాయడు.ధర్మవరపు దుర్గాప్రసాద్. ఏ అర్ కానిస్టేబుల్ మేకల నరేంద్ర లు అద్దంకి పట్టణంలో నాగురించి చెడుగా ప్రచారం చేస్తున్నారు. రామానాయుడు. మా అత్తయ్య నా పైన .బంధువుల 2023 సంవత్సరంలో ఫిర్యాదు ఇచ్చినట్లు ఇటీవల అద్దంకి పోలీసు వారు చెప్పే వరకు మాకు తెలియదని సడన్ గా పోలీసులు ఫోన్ చేసి మీరంతా జైలుకి వెళ్తారా అని విపరీతంగా ఫోన్లు చేసి తీవ్రమైన ఒత్తిడి చేస్తున్నారు. అదేవిధంగా మేము ఉంటున్న ఇంటి చుట్టూ ఏ ఆర్ కానిస్టేబుల్ మేకల నరేంద్ర. ధర్మవరపు దుర్గాప్రసాద్ లు మనుషులను వెంట బెట్టుకొని వచ్చి విడాకులు ఇచ్చి ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోవాలని లేకపోతే మిమ్మల్ని మీ బంధువులు అందరికీ ఇస్తామని మేనమామ పిల్లల్ని ఫారిన్ వెళ్లకుండా కేసులు పెడతామని బెదిరింపులకు గురి చేస్తున్నారు. వత్తిడి తెస్తున్నారు.మేము ఏమి తప్పు చేశామని జైలుకెళ్లాలి..అన్యాయం జరిగింది నాకు అనుకుని ఆలోచన చెయ్యగా నేను మా అత్తగారి ఇంటికి వెళ్ళిన నాటినుండి నాకు వరసకు సోదరులు అయ్యే వారి దగ్గర బంధువులు ధర్మవరపు దుర్గాప్రసాద్. మేకల నరేంద్ర.మావారు కామేశ్వరరావు.రామ నాయడు లతో చేతులు కలిపి మాకు దగ్గర అయ్యి మీ ఆయనను నిన్ను ఒక్కటి చేస్తామని నమ్మ బలికి మాతో మాటలు కలిపి వస్తూ పోతూ నా ఫోను ను ఏ అర్ కానిస్టేబుల్ ,మేకల నరేంద్ర. ధర్మవరపు దుర్గాప్రసాద్ లు నా ఫోన్ ను హ్యాక్ చేసి నాకు సంబంధం లేకుండా నా ఫోన్ నుంచి మెసేజ్ లు , ఫోన్ కాల్స్ వెళ్లేటట్టుగా చేసి నన్ను తిరుగుబోతు దానిగా చిత్రీకరించేందుకు ప్రయత్నం చేశారు
నన్ను తాగుబోతు గా తిరుగుబోతుగా చిత్రీకరించేందుకు ప్రయత్నం చేశారు, అంతేకాకుండా పలుమార్లు రామనాయడు .మా అత్తయ్య ప్రోద్భలంతో ఏ.ఆర్. కానిస్టేబుల్ మేకల నరేంద్ర ధర్మవరపు దుర్గాప్రసాద్ లు నాపై హత్యాయత్నం చేసేందుకు ప్రయత్నం చేశారు.రామ నాయడు , ఏ అర్ కానిస్టేబుల్ మేకల నరేంద్ర,ధర్మవరపు దుర్గాప్రసాద్ ల వలన ప్రాణ హాని కలదు మరియు నాపై నాకుటుంబ సబ్యులపై తప్పుడు కేసులు పెట్టిస్తూ ఇబ్బంది పెట్టుచున్నారు.అందుకని నాకు న్యాయం చేయమని అదే విధముగా నాలాంటి ఆడ పిల్లలకు అన్యాయం జరగండ ప్రస్తుతం గోవింద అంబిక జూనియర్ కాలేజీ డైరెక్ట గా పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉండి రామానాయుడు, సమాజ రక్షణ విభాగంలో ఉద్యోగం చేస్తున్న నరేంద్ర .ధర్మవరపు దుర్గా ప్రసాద్ లు ముగ్గురు కలిసి ఆడపిల్లలకు చేస్తున్నా అన్యాయాలు నలుగురికి తెలియాలని. నా జీవితం నాశనమైనట్టుగా మరే ఆడ పిల్లలకు అన్యాయం జరగకుండా నాకు న్యాయం చేయాలని గౌరవ పలనాడు జిల్లా ఎస్పీ గారికి స్పందనలో ఫిర్యాదు ఇవ్వడం జరిగిందని తెలిపారు నాకు న్యాయం జరిగే వరకూ న్యాయ పోరాటం చేస్తానని మీడియావారు సహకరించాలని
నా లా ఏ ఆడపిల్లలకు అన్యాయం జరగకుండా ఉండాలనే సీఎం చంద్రబాబు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, హోంమంత్రి అనిత గారు,కు విజ్ఞప్తి చేస్తూ వీడియో విడుదల చేస్తున్నానని దయుంచి మీడియా వారు అందరూ సహకరించి వారికి చేరేవరకు నా ఈ వీడియోని షేర్ చేయాలని విజ్ఞప్తి చేస్తూ వేడుకుంటున్నట్లు తెలిపారు
Also read
- బందర్లో దృశ్యం మార్క్ క్రైమ్ స్టోరీ.. పెనిమిటి హత్యకు శ్రీమతి స్కెచ్
- శివయ్యకి అపచారం…. తిన్నడికి ద్రోహం…”నకిలీ కన్నప్ప సినిమాని బహిష్కరించండి”
- Hyderabad: అలా వచ్చారు.. ఇలా వెళ్లిపోయారు.. మధ్యలో శాల్తీలు లేచాయి
- Drug Injections: ఏపీలో మత్తు ఇంజెక్షన్ల కలకలం
- Ayodhya Ram Mandir: అయోధ్య ప్రసాదం పేరు చెప్పి ఆన్లైన్లో రూ.3.85 కోట్లు స్వాహా