పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో 8 ఏళ్ల బాలికపై 70 ఏళ్ల వృద్ధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయితే అక్కడ బాలిక మేనమామ వృద్ధుడిపై దాడికి పాల్పడ్డాడు. నిందితుడు షేక్ మీరావలి గొంతుకోశాడు.
ఏపీలో దారుణం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో 8 ఏళ్ల బాలికపై 70 ఏళ్ల వృద్ధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయితే అక్కడ బాలిక మేనమామ వృద్ధుడిపై దాడికి పాల్పడ్డాడు. నిందితుడు షేక్ మీరావలి గొంతుకోశాడు. వెంటనే పోలీసులు వృద్ధుడిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలిక మేనమామపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది
Also read
- రక్తపుమడుగులో విగతజీవిగా పడి ఉన్న ఒంటరి మహిళ.. కారణం అదేనా?
- కూతురు పెళ్లి మండపానికి చేరుకునే లోపే ఆగిన తండ్రి గుండె..!
- Garuda Puran: గరుడ పురాణం ప్రకారం స్త్రీలు పొరపాటున కూడా ఈ 4 పనులు చేయవద్దట.. ఎందుకంటే
- నేటి జాతకములు….7 జూన్, 2025
- HYD Crime News: పోర్న్ చూస్తున్న వారికి బిగ్ షాక్.. HYDలో ఐదుగురు అరెస్ట్!