భార్యను అతి కిరాతకంగా హతమార్చి పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు ఓ భర్త. ఈ దారుణమైన ఘటన నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం గంట్రావుపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని, భార్య నిలదీయడంతో విచక్షణ కోల్పోయి కిరాతకానికి పాల్పడ్డాడు. 30 ఏళ్ల దాంపత్య బంధానికి తెర దించాడు భర్త నాగశేషి.
భార్యను అతి కిరాతకంగా హతమార్చి పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు ఓ భర్త. ఈ దారుణమైన ఘటన నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం గంట్రావుపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని, భార్య నిలదీయడంతో విచక్షణ కోల్పోయి కిరాతకానికి పాల్పడ్డాడు. 30 ఏళ్ల దాంపత్య బంధానికి తెర దించాడు భర్త నాగశేషి.
నాగర్ కర్నూల్ జిల్లా పెద్ద కొత్తపల్లి మండలం గంట్రావుపల్లి గ్రామానికి చెందిన గొల్ల ఎలుక నాగశేషి, భార్య ఎల్లమ్మ(40)కు 1995లో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు మగ పిల్లలు, ఒక కూతురు ఉన్నారు. ఆలుమగలు ఇద్దరు వ్యవసాయ పనులు చేసుకుంటూ కుటుంబ పోషణ చేస్తున్నారు. 30 ఏళ్లుగా పచ్చగా సాగుతున్న వీరి సంసారంలో భర్త వివాహేతర సంబంధం, మద్యం అలవాటు చిచ్చురేపింది.
అప్పుడప్పుడు వీరి మధ్య చిన్న చిన్న గొడవలు జరుగుతున్న కొద్దిసేపటికే సద్దుమణిగేది. అయితే మే 29వ తేదీన నాగశేషి బావమరిది ముంత శ్రీనివాస్ దంపతులకు వడి బియ్యం పెట్టి రాత్రి వారిని ఇంటికి పంపించారు. అదే వేడుక సందర్భంగా రాత్రి నాగశేషి ఎక్కువగా మద్యం సేవించాడు. రాత్రి సుమారు 10.30 నిమిషాల సమయంలో నాగశేషి, భార్య ఎల్లమ్మకు మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో భర్త వివాహేతర సంబంధాన్ని భార్య ఎల్లమ్మ నిలదీయడంతో గొడవ కాస్త పెద్దదైంది. దీంతో ఆగ్రహించి ఎల్లమ్మను నాగశేషి విచక్షణ రహితంగా కర్రతో దాడి చేశాడు. అడ్డుకోబోయిన తండ్రి బిచ్చన్నను పక్కకు తోసేశాడు.
తీవ్ర గాయాలైన ఎల్లమ్మ, నాగశేషి తండ్రి కేకలు వేయడంతో చుట్టూ పక్కల వారు గమనించి వనపర్తి ఆస్పత్రికి తరలించారు. అర్దరాత్రి చికిత్స పొందుతూ ఎల్లమ్మ మృతి చెందింది. ఘటన అనంతరం తన భార్యను తానే చంపానని పోలీసుల ఎదుట లొంగిపోయాడు భర్త నాగశేషి. ఎల్లమ్మ మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం గ్రామానికి తీసుకుని వచ్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనపై విచారణ చేపట్టారు. మద్యం మత్తులోనే ఘటన జరిగినట్లు పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఇక మూడు దశాబ్దాల దాంపత్య జీవితాన్ని వివాహేతర సంబంధం అనుమానాలు, మద్యం మత్తు చిత్తు చేసింది. అనుకోని ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Also read
- పోలీస్ స్టేషన్లో కాల్పుల కలకలం.. AK-47తో కాల్చుకుని ఎస్ఐ ఆత్మహత్యాయత్నం!
- మధ్యాహ్న భోజన పథకం కార్మికుల పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి….. గ్రీష్మ కుమార్, ఐ.యఫ్టియు రాష్ట్ర కమిటీ సభ్యులు.
- Ganesh Chaturthi: గణేశుడికి ఏనుగు తల ఎలా వచ్చింది? గజాసురుడి తలనే ఎందుకు పెట్టారు.. అసలు కథ ఇదే!
- భాద్రపద మాసం.. వినాయక చవితి నుంచి మహాలయ అమావాస్య వరకు.. ఈ మాసంలోని పండగలివే!
- వినాయక చవితి వేళ అద్భుత గ్రహ యోగాలు.. ఈ రాశుల వారికి గణపతి ఆశీస్సులతో పట్టిందల్లా బంగారమే!





