జూబ్లీహిల్స్లోని బేబీలాన్ పబ్లో తాము ఆర్డర్ చేయని డ్రింక్స్కు బిల్ వేశారని ప్రశ్నించినందుకు సిబ్బంది కస్టమర్లపై దాడికి పాల్పడ్డారు. పబ్లో లైట్లు ఆపేసి తన తల్లి, చెల్లిని కొట్టారని సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ మీనల్ మీను ఆవేదన వ్యక్తం చేసింది.
హైదరాబాద్ జూబ్లీహిల్స్లో అరాచకం వెలుగులోకి వచ్చింది. బేబీలాన్ పబ్లో సిబ్బంది కస్టమర్లపై దాడికి పాల్పడ్డారని బాధితులు వాపోయారు. పబ్లో లైట్లు ఆపేసి తన తల్లి, చెల్లిని కొట్టారని సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ మీనల్ మీను ఆవేదన వ్యక్తం చేసింది. ఆమె జరిగిన దాడిని సోషల్ మీడియా వేదికగా వివరించింది.
తాము ఆర్డర్ చేయని డ్రింక్స్కు బిల్ వేశారని అడిగినందుకు కొట్టడం స్టార్ట్ చేశారని ఆమె చెప్పుకొచ్చింది. వీడియో తీస్తుంటే బెదిరించి లైట్లు ఆర్పేసి దాడి చేశారని బాధితురాలు తెలిపింది. బేబీలాన్ పబ్పై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ FIR చేయలేదని మీనల్ మీను ఆవేదన వ్యక్తం చేశారు.
Also read
- Hyderabad: పండగ బట్టల కోసం భర్తతో గొడవ.. కోపంతో భార్య ఏం చేసిందో తెలుసా..? ఛీ..ఛీ..
- కూతురి టెన్త్ పరీక్షలు.. గుడికి వెల్దామని బయలుదేరారు.. అంతలోనే..
- ఎంతకు తెగించావురా.. భార్యపై అనుమానం.. భర్త ఏం చేశాడో తెలుసా..?
- నార్సింగిలో ఆరేళ్ల బాలికపై అత్యాచారం.. ఆపై హత్య
- దుష్ప్రచారాలు నమ్మవద్దు.. ఎంపీ పుట్టా మహేష్ కుమార్.





