గుంతకల్లు రైల్వే స్టేషన్ లో ఘోర విషాదం చోటుచేసుకుంది. 7వ నెంబర్ ప్లాట్ ఫార్మ్ వద్ద పెచ్చులూడి తలపై పడటంతో బాలుడు మృతి చెందాడు. వెయింటింగ్ హాల్లోని గోడపక్కనే తల్లి బాలుడిని నిద్రపుచ్చుతుండగా ఈ ఘోరం జరిగింది. మృతి చెందిన బాలుడి పేరు మణికంఠ 14 ఏళ్ళు
AP News: స్కూల్ లో పెచ్చులూడిపడి, పైకప్పు కూలి చనిపోయిన సంఘటనలు నిత్యం వార్తల్లో వినిపిస్తూనే ఉంటాయి. ఇప్పుడు అలాంటి సంఘటనే గుంతకల్ రైల్వే స్టేషన్ లో జరిగింది. అధికారుల నిర్లక్ష్యంతో బాలుడి ప్రాణం పోయింది. ఓ తల్లికి కడుపు కోత మిగిల్చింది.
పెచ్చులూడి
కర్నూలుకు చెందిన వెంకటేశ్వర్లు కుటుంబం కలిసి రామేశ్వరం వెళ్లడానికి తెల్లవారుజామున గుంతకల్లు రైల్వే స్టేషన్ కి చేరుకున్నారు.
ట్రైన్ రావడానికి ఇంకా సమయం ఉండడంతో 7వ నెంబర్ ప్లాట్ ఫార్మ్ వద్ద వెయింటింగ్ హాల్లోని గోడపక్కన వెంకటేశ్వర్లు భార్య కొడుకును నిద్రపుచ్చుతుంది. ఈ క్రమంలో గోడ పెచ్చులూడి బాబు తలపై పడ్డాయి. ఈ ప్రమాదంలో బాలుడు మృతి చెందాడు. మృతి చెందిన బాలుడి పేరు మణికంఠ 14 ఏళ్ళు అని తెలిసింది.
Also read
- అనంత హనీట్రాప్.. రంగమ్మ అరెస్ట్, వీఆర్ కు సీఐలు..
- డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్టు
- షాపింగ్కు వెళ్లిన భర్త.. సైలెంట్గా ఫాలో అయిన భార్య.. ఆ తర్వాతే అసలు ట్విస్ట్..!
- వివాహేతర సంబంధం భర్తకు తెలిసిందని..
- రాత్రి పూట పేకాట ఆడేందుకు వెళ్లి మిస్సింగ్.. మిస్టరీగా మారిన ఘటన





