జీడిమెట్ల: జీడిమెట్ల పీఎస్ పరిధిలో ట్యూషన్ టీచర్ నిర్వాకం వెలుగులోకి రావడంతో బాలుడు తండ్రి ఖంగుతిన్నాడు. సదరు టీచర్.. బాలుడి వద్ద నుంచి దాదాపు రెండు లక్షలు తీసుకున్నట్టు తండ్రి గుర్తించి.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో పోలీసులు పట్టించుకోకపోవడంతో హెచ్ఆర్సీని ఆశ్రయించారు.
వివరాల ప్రకారం.. జీడిమెట్ల పరిధిలో కమల్ నివాసం ఉంటున్నారు. కమల్ కుమారుడు.. స్థానికంగా ఉన్న ఓ ట్యూషన్ టీచర్ వద్దకు ట్యూషన్కు వెళ్తున్నాడు. ఈ క్రమంలో ట్యూషన్ వస్తున్న బాలుడిని సదరు టీచర్ డబ్బులు అడగంతో అతడు తన ఇంట్లో మనీ దొంగతనం చేసి టీచర్కు ఇస్తున్నాడు. ఇలా పలుమార్లు డబ్బులు దొంగలించి.. రెండు లక్షలకుపైగా టీచర్కు ఇచ్చాడు. ఇక, ఇటీవలే.. ఐఫోన్ కూడా టీచర్కు ఇచ్చాడు.
తనకు ఫోన్ వద్దని.. డబ్బులే కావాలని సదరు టీచర్ అడగటంతో సదరు బాలుడు ఫోన్ అమ్మకానికి పెట్టాడు. అనంతరం, ఆ డబ్బులను మళ్లీ టీచర్ కు అందజేశాడు. ఈ నేపథ్యంలో మొబైల్ షాప్ ఓనర్.. బాలుడి తండ్రికి సమాచారం ఇవ్వడంతో ఈ వ్యవహారం బయటకు వచ్చింది. అసలు విషయంలో కమల్కు తెలియడంతో ఒక్కసారిగా షాకయ్యాడు. దీంతో, వెంటనే కమల్.. జీడిమెట్ల పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు. అయితే, అతడి ఫిర్యాదును పోలీసులు పట్టించుకోకపోవడంతో కమల్.. తాజాగా
హెచ్ ఆర్ సి ని ఆశ్రయించారు. సదరు టీచర్పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.
Also read
- సోషల్ మీడియా రీల్స్ పిచ్చి.. ఉమ్మెత్త పువ్వు కూర వండుకుని తిన్న కుటుంబం.. పరిస్థితి విషమం
- యూట్యూబ్లో చూసి ప్లాన్.. భార్యకు పాలకోవా తినిపించి..
- ఆమె ఓ యాంకర్.. పగలంతా హోస్టింగ్.. రాత్రయితే..
- రాత్రి బాయ్ఫ్రెండ్.. ఉదయం గర్ల్ఫ్రెండ్ సూసైడ్.. ఒక్క ఫోన్కాల్ ఎంత పని చేసిందో..!
- పక్కోడి పెళ్లిలో ఇంకెన్నాళ్లు డ్యాన్స్ చేస్తారు?.. తెలంగాణ బీజేపీ నేతలపై ఎమ్మెల్యే రాజాసింగ్ సెటైర్లు





