ఉపాధి ఎర వేసి లక్షల్లో డబ్బు వసూలు చేసి యువతను విదేశాలకు తరలించే దందా ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే కంబోడియా దేశానికి వందలాది మంది భారతీయులు ఉపాధి పేరిట తీసుకెళ్లిన చైనాకు చెందిన ముఠాలు సైబర్ క్రైమ్స్కు పాల్పడుతున్నట్టుగా నిఘా వర్గాలు గుర్తించాయి. మయన్మార్ లో సైతం ఇదే విధానం కొనసాగుతున్నట్టుగా స్పష్టం అవుతోంది.
ఉపాధి ఎర వేసి లక్షల్లో డబ్బు వసూలు చేసి యువతను విదేశాలకు తరలించే దందా ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే కంబోడియా దేశానికి వందలాది మంది భారతీయులు ఉపాధి పేరిట తీసుకెళ్లిన చైనాకు చెందిన ముఠాలు సైబర్ క్రైమ్స్కు పాల్పడుతున్నట్టుగా నిఘా వర్గాలు గుర్తించాయి. మయన్మార్ లో సైతం ఇదే విధానం కొనసాగుతున్నట్టుగా స్పష్టం అవుతోంది.
ఈ క్రమంలోనే తెలంగాణాలోని కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం రంగపేటకు చెందిన కొక్కిరాల మధూకర్ రెడ్డి మయన్మార్ చేరిన తరువాత అక్కడ ఉన్న పరిస్థితులను గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం చేరవేశాడు. దీంతో అతని తండ్రి లక్ష్మారెడ్డి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ను కలిసి తన గోడు వెల్లబోసుకున్నారు. మయన్మార్లోని మైవాడీ జిల్లాలో తిష్ట వేసిన చైనాకు చెందిన సైబర్ నేరాల ముఠాల చేతిలో దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన నిరుద్యోగులు చిక్కుకున్నారు. పెద్ద ఎత్తున భారతీయ యువకులు ఉన్నారన్న విషయాన్ని లక్ష్మారెడ్డి కేంద్ర మంత్రికి వివరించారు. దీంతో హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మయన్మార్ దేశంలో జరుగుతున్న వ్యవహారం గురించి, మానవ అక్రమ రవాణా జరుగుతోందన్న విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.
ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం అక్రమ నిర్బంధంలో ఉన్నవారికి విముక్తి కల్పించారు. బండి సంజయ్ చొరవ తీసుకుని రెండు విమానాల్లో 578 మంది బాధితులను క్షేమంగా స్వదేశానికి తరలించారు. భారతదేశం నుండి పలువురు ఉన్నతాధికారులు మమన్మార్ దౌత్య కార్యాలయంతో సంప్రదింపులు జరిపి ఒత్తిడి తీసుకరావడంతో మయన్మార్ ప్రభుత్వం భారత్కు చెందిన బాధితులను ఆర్మీ కంట్రోల్ లోకి తీసుకుని భారతదేశానికి అప్పగించింది.
విదేశాల్లో ఉద్యోగాల పేరిట ఒక్కో నిరుద్యోగి వద్ద రూ. 3 లక్షలు వసూలు చేస్తున్నారు నకిలీ ఏజెంట్లు. మయన్మార్ చేరుకున్న తరువాత వారిని 3 వేల డాటర్లకు ఒక్కరి చొప్పున చైనాకు చెందిన సైబర్ నేరాల జరిపించే గ్యాంగులకు విక్రయించారు. చైనా ముఠాల ద్వారా నిర్వహించే డాటా సెంటర్ల ద్వారా సైబర్ క్రైమ్స్కు పాల్పడాలంటూ వేధింపులకు గురి చేస్తున్నారు. సామాన్యుల అకౌంట్లకు సంబంధించిన వివరాలను సేకరించేందుకు ఆయా రాష్ట్రాలకు చెందిన వారికి తమ వద్ద బందీగా ఉన్న బాధితులచే ఫోన్లు చేయించే డబ్బులు బదిలీ చేసుకుంటున్నారు. అంతర్జాతీయ స్థాయిలో మోసాలకు పాల్పడేందుకు ఇప్పటికే కంబోడియా కేంద్రంగా భారీ దందా సాగుతోందని వెలుగులోకి రాగా తెలంగాణ, ఏపీ పోలీసు ఉన్నతాధికారులు వందలాది మంది యువకులను స్వస్థలాలకు రప్పించగలిగారు. అయితే సైబర్ ఫ్రాడ్ కంపెనీలు తాజాగా మయన్మార్ కేంద్రంగా ఉద్యోగాల ఎర వేసి మానవ అక్రమ రవాణాకు నడుం బిగించినట్టుగా తాజా ఘటనతో స్పష్టం అవుతోంది.
సైబర్ నేరాలకు పాల్పడేందుకు మయన్మార్ కేంద్రంగా జరుగుతున్న తతంగంపై కరీంనగర్ జిల్లా మానకొండూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఏజెంట్ల అవతారం ఎత్తి ఇక్కడి యువతకు ఉపాధి కల్పిస్తామంటూ హ్యూమన్ ట్రాఫికింగ్ జరుపుతున్నారన్న విషయాన్ని గుర్తించారు. ఈ కేసులో అనుమానితులుగా హితేష్ అర్జన సోమయ, రాజశేఖర్ అలియాన్ రోమన్ లపై కేసు నమోదు చేశారు. వీరిద్దరూ కూడా మయన్మార్ లోనే ఉన్నారని భావించిన కరీంనగర్ కమిషనరేట్ పోలీసులు లుక్ ఔట్ సర్క్యూలర్ జారీ చేసినట్టుగా తెలుస్తోంది. మయన్మార్ నుండి స్వదేశానికి తిరిగి వచ్చిన బాధితుల నుండి ఇంటలిజెన్స్ బ్యూరో (IB), సెంట్రల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ (CBI) విభాగాల అధికారులు వాంగ్మూలాలు తీసుకుంటున్నారు.
Also read
- కాకినాడలో విషాదం.. పసిపిల్లల పాలిట మృత్యువుగా మారిన తండ్రి
- Hyderabad: అనుమానాస్పదంగా ఫుడ్ డెలివరీ బాయ్.. డౌట్ వచ్చి.. సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయగా
- HYD: హైదరాబాద్ లో దారుణం..హోలీ పేరుతో యాసిడ్ దాడి
- Hyd Drugs: గంజాయి ఐస్క్రీమ్తో ఎంజాయ్.. హోళీ వేడుకల్లో పోలీసులకు చిక్కకుండా ప్లాన్.. షాకింగ్ వీడియో!
- AP News: రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా కనిపించిన నల్లటి బ్యాగ్.. తెరిచి చూడగా