అనకాపల్లి జిల్లాలో ఓ దారుణ ఘటన చోటు చేసుకుంది. అక్రమ సంబంధం ఓ మహిళ ప్రాణం మీదకు తెచ్చింది. ఎక్కడ తమ అక్రమ సంబంధం బయట పడిపోతుందేమోనని భయపడిన ఓ జంట.. అక్రమంగా ఓ మహిళ ఇంట్లోకి చొరబడి.. ఆ తర్వాత ఏమైందంటే..
అనకాపల్లి జిల్లా మునగపాక.. ఓ ఇంట్లో భార్యాభర్తలు నివాసం ఉంటున్నారు. భర్త అచ్యుతాపురం సెజ్లో డ్యూటీకి వెళ్ళాడు. ఈలోగా ఆ ఇంటిలోకి ప్రియుడు ఎంటర్ అయ్యాడు. ఆ తరువాత.. ఇద్దరూ కలిసి పక్కింట్లో ఉంటున్న మహిళపై విచక్షణారహితంగా దాడి చేశారు. కేకలు వేయకుండా నోట్లో వస్త్రాలు కుక్కి.. చేతులు కట్టి.. రాడ్డుతో ఎటాక్ చేసారు.
వివరాల్లోకి వెళ్తే.. అనకాపల్లి జిల్లా గణపర్తికి చెందిన దీపిక అనే మహిళ మునగపాక ఎన్టీఆర్ కాలనీలో అద్దె ఇంట్లో నివాసముంటుంది. ఆమె ఇంటి పక్కనే రాజ్ కుమార్, సరిత దంపతులు నివాసం ఉంటున్నారు. రాజ్ కుమార్ అచ్యుతాపురంలోని ఓ కంపెనీలో విధులు నిర్వహిస్తున్నాడు. అయితే.. భర్త డ్యూటీకి వెళ్లిన తరువాత రాజ్ కుమార్ భార్య సరిత తన ప్రియుడు శాంతిరాజ్ను ఇంటికి పిలిచేది. ఈ వ్యవహారం కాస్తా దీపిక గమనించినట్టు సరిత తెలుసుకుంది. దీపిక ద్వారా తన యవ్వారం భర్తకు తెలిసిపోతుందేమోనని అనుమానంతో ఆందోళన చెందింది సరిత. ఈ విషయం ప్రియుడితో చెప్పింది. దీంతో ఇద్దరూ కలిసి.. బుధవారం రాత్రి పదిన్నర గంటల సమయంలో దీపిక ఇంట్లోకి చొరబడ్డారు.
ఆమె నోట్లో వస్త్రాలు కుక్కి.. కాళ్లు, చేతులు తాళ్లతో కట్టారు. ఇనుప రాడ్డుతో దీపికపై విచక్షణారహితంగా దాడి చేశారు. ఇంతలో డ్యూటీ నుంచి ఇంటికి వచ్చిన రాజ్ కుమార్.. తన ఇంట్లో ఎవరూ లేకపోవడంతో వెతికాడు. పక్కింట్లో శబ్దాలు రావడంతో వెళ్లి పరిశీలించాడు. అప్పటికే అక్కడ నుంచి పరారయ్యారు సరిత, ఆమె ప్రియుడు శాంతిరాజ్. రక్తపు మడుగులో పడి ఉన్న దీపికను ఆసుపత్రికి తరలించారు. దీపిక ఫిర్యాదుతో హత్యాయత్నం కేసు నమోదు చేసిన పోలీసులు.. సరిత, ఆమె ప్రియుడు శాంతి రాజ్లను అరెస్టు చేశారు.
Also read
- బ్రహ్మకు జ్ఞానోపదేశం చేసిన శివుడు
- Maha Shivaratri 2025 : మహాశివరాత్రికి జాగరణ ఎందుకు చేయాలి?
- నేటి జాతకములు 24 ఫిబ్రవరి, 2025
- AP news : పోలవరం కాల్వలో పడి ఇద్దరు యువకుల మృతి
- పదిరోజులకే పెళ్లి పెటాకులు.. హనీమూన్లో గొడవ.. చివరికి బిగ్ ట్విస్ట్!