ఏపీలో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. అన్నమయ్య జిల్లా రాయచోటిలో పదో తరగతి బాలికపై ప్రభుత్వ ఆస్పత్రి ల్యాబ్ టెక్నీషియన్ విజయ్ లైంగిక దాడి చేశాడు. 7నెలల గర్భావతికి అబార్షన్ చేయించాడు. పోక్సో కేసు పెట్టి నిందితుడిని అరెస్ట్ చేసినట్లు సీఐ చంద్రశేఖర్ తెలిపారు.
AP News: ఏపీలో మరో దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అన్నమయ్య జిల్లా రాయచోటిలో పదో తరగతి బాలికపై లైంగిక దాడి చేశాడు ల్యాబ్ టెక్నీషియన్ విజయ్ కుమార్. ఆమె ఏడు నెలల గర్భం దాల్చడంతో ఓ ప్రవేటు ఆస్పత్రిలో నర్సు సాయంతో అబార్షన్ చేయించాడు. బాలిక కుటుంబ సభ్యల ఫిర్యాదు మేరకు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి విజయ్ ని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు.
హెచ్ఐవీ మందుల కోసం వస్తే..
ఈ మేరకు రాయచోటి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 10వ తరగతి చదువుతున్న బాలిక హెచ్ఐవీ మందుల కోసం ప్రతి నెలా రాయచోటి ప్రభుత్వ ఆస్పత్రికి వస్తోంది. ఈ సమయంలోనే అదే ఆస్పత్రిలో రోజు వారీ వేతనంపై పనిచేస్తున్న ల్యాబ్ టెక్నీషియన్ విజయ్.. ఆమెపై కన్నేశాడు. ఎవరు లేని టైమ్ లో బలవంతంగా లైంగికదాడి చేశాడు.
దీంతో గర్భం దాల్చి ఏడు నెలలు గడించింది. కొంతకాలంగా మౌనంగా ఉన్న విజయ్.. ఇటీవల ఆమెకు ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేసే ఓ నర్సు సాయంతో అబా ర్షన్ చేయించాడు. బాలిక కుటుంబానికి విషయం తెలియడంతో రాయచోటి పోలీస్ స్టేషన్ లొ ఫిర్యాదు చేశారు. నిందితుడు విజయ్ పై పోక్సో కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నట్లు అర్బన్ సీఐ చంద్రశేఖర్ తెలిపారు.
Also read
- ఆ ఆలయంలో పూజ చేస్తే అపమృత్యు దోషం దూరం! ఎక్కడుందంటే?
- నేటి జాతకములు….25 అక్టోబర్, 2025
- Telangana: 45 ఏళ్ల మహిళతో పరాయి వ్యక్తి గుట్టుగా యవ్వారం.. సీన్లోకి కొడుకుల ఎంట్రీ.. కట్ చేస్తే
- ఉపాధి కోసం కువైట్ వెళ్తానన్న భార్య.. వద్దన్న భర్త ఏం చేశాడో తెలుసా?
- Telangana: వారికి జీతాలు ఇచ్చి ఆ పాడు పని చేపిస్తున్నారు.. పొలీసులే నివ్వెరపోయిన కేసు ఇది..




