SGSTV NEWS online
CrimeNational

నేపాలీ జంట కోసం ఇంటర్ పోల్ కు మొర



యశవంతపుర: నగల షాపు యజమాని ఇంట్లో పనిచేస్తూ  రూ.15.15 కోట్ల విలువగల బంగారాన్ని దోచుకెళ్లిన నేపాలీ జంట ఆచూకీ లేదు. కొన్ని నెలల కిందట సురేంద్రకుమార్ జైన్ ఇంటిలో నేపాల్కు చెందిన నేమిరాజ్ దంపతులు పనిచేస్తూ నమ్మకంగా ఉండేవారు. నవంబర్ 1న జైన్ కుటుంబం గుజరాత్లో ఇంటి పండగుక వెళ్లినప్పుడు నేమిరాజ్ దంపతులు డబ్బు బంగారంతో ఉడాయించారు. అప్పటినుంచి పోలీసులు గాలిస్తున్నా జాడ లేదు. నేపాలు పారిపోయి దాక్కున్నట్లు అనుమానం. బెంగళూరు పోలీసులకు కష్టతరంగా మారడంతో ఇంటర్ పోలు సమాచారమిచ్చారు. వారి ఆచూకీ తెలిస్తే చెప్పాలని అభ్యర్థించారు.

Also read

Related posts