నిత్యం వేధిస్తున్న ఆకతాయికి తగిన బుద్ధి చెప్పింది యువతి. పక్కా స్కెచ్ వేసి పిలిపించి అందరి ముందు చితకబాదింది.
జనగామ జిల్లా కేంద్రంలో ఓ యువతి శివమెత్తింది. తనను వేధిస్తున్న ఆకతాయిలను తగిన బుద్ధి చెప్పింది. వారి వేధింపులు భరిస్తూ వచ్చిన యువతి చాకచక్యంగా పట్టుకుని దేహశుద్ధి చేసింది. వారిని వెంటపడి మరీ, ఎడాపెడా వాయించింది. ఈ ఘటన జనగామ జిల్లా కేంద్రంలోని బతుకమ్మ కుంట వద్ద జరిగింది.
గానుగుపహాడ్ గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు రెండు రోజుల నుండి ఓ యువతి వెంటపడి వేధిస్తున్నారు. చిరు వ్యాపారం చేసుకునే ఆ యువతి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారు. మాటలతో, వెకిలి చేష్టలతో వేధించారు. దీంతో శివమెత్తిన యువతి వారిని పట్టుకోవడానికి ప్రయత్నించింది. కానీ చిక్కకపోవడంతో మాట్లాడదాం రమ్మంటూ మధ్యవర్తులతో పిలిపించింది. బతుకమ్మ కుంట వద్దకు చేరుకోగానే ఆ యువతితో సహా కుటుంబ సభ్యులు కట్టలు తెంచుకున్న ఆగ్రహంతో ఊగిపోయారు.
అతగాడిని పట్టుకుని ఎడా పెడా వాయించారు. దేహశుద్ధి చేశారు. చివరికి జరిగి దానికి క్షమాపణ చెప్పడంతో శాంతించిన యువతి కుటుంబసభ్యులు వదిలేశారు
Also Read
- ఆంధ్ర: తల్లికి వందనం పడిందా అని అడిగారు.? ఒక్క ఫోన్ కాల్తో అంతా పాయే
- పక్కింటి పిల్లాడు ఇచ్చిన ఒకే ఒక్క క్లూ.. వీడిన మహిళ మర్డర్ మిస్టరీ..!
- Andhra: ఆవు దూడ కోసం గొడవ.. క్షణాల్లోనే అన్నను మట్టుబెట్టిన తమ్ముడు.. అసలేం జరిగిందంటే
- ఫ్రెండ్స్ మిమ్మల్ని అందరిని వదిలేసి వెళ్ళిపోతున్నా..
- Kadapa: ఏడ్చుకుంటూ పరుగున పోలీస్స్టేషన్కు వచ్చిన చిన్నారి.. ఏంటని ఆరా తీయగా