దిల్లీలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని దుండగులు హత్య చేసిన ఘటన బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.
దిల్లీ: తెల్లవారితే తమ తల్లిదండ్రుల వివాహ వార్షికోత్సవం ఉందని వారి కుమారుడు, కుమార్తె అన్ని ఏర్పాట్లు చేశారు. కాని తెల్లారేసరికి వారి ఆనందం ఆవిరైపోయింది. తాను బయటకు వెళ్లొచ్చేలోపు గుర్తుతెలియని వ్యక్తుల దాడిలో తల్లిదండ్రులు, సోదరి ప్రాణాలు కోల్పోవడంతో ఆ యువకుడు కన్నీరుమున్నీరుగా విలపించాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీలోని నెబ్సరాయి ప్రాంతంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని దుండగులు కత్తితో దారుణంగా పొడిచి హత్య చేశారు. స్థానిక నెబ్సరాయి ప్రాంతంలో దంపతులు తమ కుమారుడు, కుమార్తెతో కలిసి నివసిస్తున్నారు.
బుధవారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తులు వారి ఇంట్లోకి చొరబడి దంపతులు రాజేష్(55), కోమల్(47), వారి కుమార్తె కవిత(23)లపై కత్తితో విచక్షణా రహితంగా దాడి చేసి హత్య చేశారు.
ఆ సమయంలో వాకింగ్ వెళ్లిన కుమారుడు ఉదయం గంటల సమయంలో ఇంటికి వచ్చేసరికి ముగ్గురు రక్తపు మడుగులో పడి ఉండడం చూసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన తండ్రి రాజేష్ ఆర్మీలో పని చేసి రిటైర్ అయ్యాడని తెలిపాడు. డిసెంబర్ 4(నేడు) తమ తల్లిదండ్రుల వివాహ వార్షికోత్సవం ఉందని.. వారితో కలిసి సంతోషంగా జరుపుకుందామనుకునేలోపు ఈ దారుణం చోటుచేసుకుందని కుమారుడు కన్నీరుమున్నీరయ్యాడు. కాగా, దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నామని.. దర్యాప్తు కొనసాగుతోందని పేర్కొన్నారు.
Also read
- Hyderabad: అంత ఈజీగా ఎలా నమ్ముతారో.. రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.33 లక్షలు కాజేసిన కేటుగాళ్లు!
- Hyderabad: పెళ్లి పేరుతో వంచన.. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేపై లైంగిక వేధింపుల కేసు.. !
- ఇలా తయారయ్యారేంట్రా.. బాకీ తీర్చమని అడిగితే బంగారం ఇచ్చాడు.. తీరా చూస్తే!
- Andhra News: ఎలా వస్తున్నాయ్రా ఇలాంటి ఐడీయాలు.. లవర్స్ను చంపి ఏం చేశాడో తెలిస్తే..
- పెళ్లి తర్వాత ప్రేమ, అడ్డుగా ఉన్న భర్త హత్యకు స్కెచ్! పాపం.. మామ బలి





