సీఐడీ విశ్రాంత అదనపు ఎస్పీ విజయ్పాల్ (Vijay paul) ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ ఎదుట విచారణకు హాజరయ్యారు.
ఒంగోలు: సీఐడీ విశ్రాంత అదనపు ఎస్పీ విజయ్పాల్ (Vijay paul) ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ ఎదుట విచారణకు హాజరయ్యారు. ప్రస్తుత ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును గతంలో వైసీపీ హయాంలో చిత్రహింసలకు గురిచేసిన కేసులో ఆయనను విచారిస్తున్నారు.
ఈ కేసులో ఈనెల 13న పోలీసులు విజయ్ పాల్ ను విచారించారు. తనకేమీ తెలియదు.. గుర్తులేదు అంటూ ఆయన అప్పట్లో విచారణాధికారుల ఎదుట చెప్పారు.
మరోవైపు ఈ కేసులో తన ముందస్తు బెయిల్ పిటిషన్ ను కొట్టేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సెప్టెంబర్ 24న ఇచ్చిన తీర్పుపై ఆయన దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషనన్ను సుప్రీంకోర్టు సోమవారం కొట్టేసింది. ఈ క్రమంలో విజయ్పాల్ నేడు విచారణకు హాజరుకావడంతో ఉత్కంఠ నెలకొంది. ఆయన్ను అరెస్ట్ చేసే అవకాశముందన్న ప్రచారం జరుగుతోంది.
Also read
- పౌర్ణమి రోజే ఆ గ్రహాల కలయిక.. ఇది ఎవరికి వరమో తెలుసా?
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- Basara Temple: బాసర అమ్మవారి ఆలయంలో భారీ చోరీ.. సీసీ కెమెరాలకు వస్త్రాలు కప్పి కిరీటం, హుండీ మాయం
- మానవత్వం మరిచిన ఇంటి యజమాని.. మృతదేహాలను ఇంట్లోకి రానివ్వకుండా గేటుకు తాళం
- సాయికృష్ణ మిస్సింగ్ కేసులో కీలక పరిణామం.. సీఐ నాగరాజు అరెస్ట్!





