సీఐడీ విశ్రాంత అదనపు ఎస్పీ విజయ్పాల్ (Vijay paul) ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ ఎదుట విచారణకు హాజరయ్యారు.
ఒంగోలు: సీఐడీ విశ్రాంత అదనపు ఎస్పీ విజయ్పాల్ (Vijay paul) ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ ఎదుట విచారణకు హాజరయ్యారు. ప్రస్తుత ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును గతంలో వైసీపీ హయాంలో చిత్రహింసలకు గురిచేసిన కేసులో ఆయనను విచారిస్తున్నారు.
ఈ కేసులో ఈనెల 13న పోలీసులు విజయ్ పాల్ ను విచారించారు. తనకేమీ తెలియదు.. గుర్తులేదు అంటూ ఆయన అప్పట్లో విచారణాధికారుల ఎదుట చెప్పారు.
మరోవైపు ఈ కేసులో తన ముందస్తు బెయిల్ పిటిషన్ ను కొట్టేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సెప్టెంబర్ 24న ఇచ్చిన తీర్పుపై ఆయన దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషనన్ను సుప్రీంకోర్టు సోమవారం కొట్టేసింది. ఈ క్రమంలో విజయ్పాల్ నేడు విచారణకు హాజరుకావడంతో ఉత్కంఠ నెలకొంది. ఆయన్ను అరెస్ట్ చేసే అవకాశముందన్న ప్రచారం జరుగుతోంది.
Also read
- ప్రతిరోజూ పెళ్లి చేసుకొనే స్వామిని సందర్శిస్తే మీకు కూడా వివాహం
- Telangana: ఇదెక్కడి యవ్వారం.. గాజుల పండక్కి పిలవలేదని.. ఏకంగా కోర్టుకెళ్లిన మహిళ.. ఎక్కడంటే?
- Andhra: పెట్రోల్ కొట్టించేందుకు బంక్కొచ్చిన కానిస్టేబుల్.. ఆపై కాసేపటికే తోపునంటూ..
- Fake DSP: ఉద్యోగాల పేరుతో యువకులకు ఎరా.. తీగలాగితే కదులుతున్న నకిలీ డీఎస్పీ దందా!
- Tuni: తండ్రి మరణంపై నారాయణరావు కుమారుడు రియాక్షన్ వైరల్.. అనూహ్య రీతిలో





