మెదక్ డిగ్రీ కాలేజీలో యువతిపై కత్తితో దాడి చేసిన ప్రేమోన్మాది ఘటన సంచలనంగా మారింది. దివ్యకృప అనే యువతిపై చేతన్య అనే యువకుడు కత్తితో దాడి చేసి పారిపోగా నిందితున్ని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు.
మెదక్ పట్టణంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద సోమవారం ఉదయం దివ్య కృపపై జరిగిన హత్యాయత్నం చేసిన నిందితుడు దనసిరి చైతన్యను 24 గంటల్లో అరెస్టు చేసి రిమాండ్ పంపినట్లు మెదక్ డీఎస్పీ ప్రసన్నకుమార్ తెలిపారు. చేతన్ అనే యువకుడు ఇన్స్టాగ్రామ్లో 2022 నుంచి దివ్య కృపతో పరిచయం చేసుకుని ప్రేమ పేరుతో వేధించడంతో, అమ్మాయి అతడిని దూరంగా ఉంచడంతో ఆ కోపంతో హత్య యత్నానికి పాల్పడినట్లు డీఎస్పీ ప్రసన్నకుమార్ తెలిపారు.
నిందితుడిని మెదక్ పట్టణంలోని బస్టాండ్లో పట్టుకున్నట్లు చెప్పారు. నిందితుడి వద్ద నుంచి సెల్ఫోన్, రక్తపు మరకలు అంటిన షర్టును స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. అమ్మాయిలు తెలియని వారితో , పరిచయం లేని వారితో, ఇన్స్టాగ్రామ్లో ఇతర సామాజిక మాధ్యమాలలో సమాచారం పంచుకోవద్దని సూచించారు. పరిచయం లేని వ్యక్తులకు ఫోటోలు వ్యక్తిగత సమాచారం ఇవ్వద్దని సూచించారు. అమ్మాయిలు ఎవరైనా ఆకతాయిలు ఫోన్లో గాని ఎక్కడైనా కానీ బస్టాండ్ వద్ద గాని వేధించినట్లు గుర్తిస్తే వెంటనే షీ టీంకుగాని, 100 కాల్ చేసి సమాచారం అందించాలన్నారు. కాలేజీ పరిసరాల్లో విద్యార్థులు వేధిస్తున్నట్లయితే ప్రిన్సిపాల్ దృష్టికి తేవాలన్నారు.
Also read
- ఆ ఆలయంలో పూజ చేస్తే అపమృత్యు దోషం దూరం! ఎక్కడుందంటే?
- నేటి జాతకములు….25 అక్టోబర్, 2025
- Telangana: 45 ఏళ్ల మహిళతో పరాయి వ్యక్తి గుట్టుగా యవ్వారం.. సీన్లోకి కొడుకుల ఎంట్రీ.. కట్ చేస్తే
- ఉపాధి కోసం కువైట్ వెళ్తానన్న భార్య.. వద్దన్న భర్త ఏం చేశాడో తెలుసా?
- Telangana: వారికి జీతాలు ఇచ్చి ఆ పాడు పని చేపిస్తున్నారు.. పొలీసులే నివ్వెరపోయిన కేసు ఇది..




