ఎన్టీఆర్ జిల్లా నందిగామలో క్షుద్రపూజల కలకలం రేపింది. చందర్లపాడు మండలం గుడిమెట్ల వజ్రాలగుట్ట వద్ద గుర్తు తెలియని వ్యక్తులు మేకలను బలిచ్చి క్షుద్ర పూజలు చేశారు. వ్యాపార అభివృద్ధి జరగాలని పేపర్పై రాసి క్షుద్ర పూజలు చేయడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు.
ప్రస్తుత ఆధునిక కాలంలో మానవుడు భూమి నుంచి ఆకాశానికి చేరుకునేంత టెక్నాలజీని కనుగొన్నాడు. కానీ కొందరు మాత్రం మూఢ నమ్మకాల పేరుతో చంపుకు చస్తున్నారు. చేతబడి, క్షుద్రపూజలు వంటి మూఢ నమ్మకాలతో బతుకుతున్నారు. వ్యాపారం బాగా జరగాలని జంతువులను బలిస్తున్నారు. అయితే ఇలాంటి వాటిపై పోలీసులు ఎన్ని అవగాహనా కార్యక్రమాలు చేపట్టినా కనీసం చైతన్యం రావడం లేదు.

బలిచ్చి క్షుద్ర పూజలు
తాజాగా అలాంటిదే ఆంధ్రప్రదేశ్లో దారుణమైన సంఘటన జరిగింది. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో క్షుద్రపూజలు కలకలం రేపాయి. చందర్లపాడు మండలం గుడిమెట్ల వజ్రాలగుట్ట వద్ద గుర్తు తెలియని వ్యక్తులు మేకలను బలిచ్చి క్షుద్ర పూజలు చేశారు. వ్యాపార అభివృద్ధి జరగాలని పేపర్పై రాసి క్షుద్ర పూజలు చేయడంతో అంతా షాక్ అవుతున్నారు.

అదే సమయంలో నాగరాజు అనే వ్యక్తి తన 3 మేకలు కనిపించపోవడంపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇందులో భాగంగానే మేకల కోసం వెతుకుతుండగా తన మేకలే బలిచ్చినట్లు నాగరాజు గుర్తించాడు. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో.. సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ క్షుద్ర పూజలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఇదిలా ఉంటే మరోవైపు నందిగామ నుంచి 15 కి.మీ దూరంలో గుడిమెట్ల గ్రామానికి సమీప ప్రాంతాల్లో వజ్రాలు దొరుకుతున్నాయి. దీంతో ఎన్నో దశాబ్దాలుగా ఆ సమీప ప్రాంతాల్లో అన్వేషణ కొనసాగుతుంది. దాదాపు రెండు రాష్ట్రాల నుంచి ఇక్కడకి వజ్రాల వేటకు వేలాది జనం వస్తుంటారు. ఇప్పుడు అదే ప్రాంతంలో గుడిమెట్ల వజ్రాలగుట్ట వద్ద గుర్తు తెలియని వ్యక్తులు మేకలను బలిచ్చి క్షుద్ర పూజలు చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది.
Also read
- TG Crime: మహిళ ఎస్సై పై చేయి చేసుకున్న కాంగ్రెస్ నేత
- Watch Video: ఫ్రెండ్ను కలవడానికి వెళ్లి 21వ అంతస్తు నుంచి దూకేసిన లేడీ టెకీ.. మిస్టరీగా మారిన సూసైడ్ కేసు!
- బందర్లో దృశ్యం మార్క్ క్రైమ్ స్టోరీ.. పెనిమిటి హత్యకు శ్రీమతి స్కెచ్
- శివయ్యకి అపచారం…. తిన్నడికి ద్రోహం…”నకిలీ కన్నప్ప సినిమాని బహిష్కరించండి”
- Hyderabad: అలా వచ్చారు.. ఇలా వెళ్లిపోయారు.. మధ్యలో శాల్తీలు లేచాయి