భార్య కలిసి ఏళ్లుగా బిచ్చం ఎత్తుకుని పోగు చేసిన డబ్బు.. కూతురి చదువుకు ఉపయోగపడుతుందని భావించి.. స్థానికంగా తెలిసిన ఓ వ్యాపారికి వడ్డీకి ఇచ్చాడు. వడ్డీ ఇవ్వకపోగా.. ఇప్పుడు అసలుకే మోసం వచ్చింది. ఆ డీటేల్స్ తెలుసుకుందాం పదండి…
ఓ ముసలాయన.. ఒంట్లో సత్తువలేక బిచ్చగాడిగా మారాడు.. గుడి దగ్గర యాచన చేస్తూ జీవితాన్ని లాగిస్తున్నాడు.. అలా వచ్చిన డబ్బులో కొంత బిడ్డ భవిష్యత్ కోసం దాచుకున్నాడు. ఆ డబ్బు తనకిస్తే అధిక వడ్డీ ఇస్తానంటూ ఆశ చూపిన వ్యాపారి.. తీరా ఇప్పుడు IP పెట్టి ముంచేశాడు..బిచ్చగాడితో పాటు మొత్తం 69 మందిని ఆ వ్యాపారి దోచేశాడు.
ఖమ్మం జిల్లాలో వింత ఘటన చోటుచేసుకుంది. బోనకల్ మండల కేంద్రంలో యాచకుడి దగ్గర అప్పు తీసుకున్న ఓ వ్యాపారి ఐపీ పెట్టాడు. ఎన్నో ఏళ్ల నుంచి సాయిబాబా గుడి దగ్గర భార్యతో కలిసి అశోక్ అనే యాచకుడు బిచ్చం ఎత్తుకుంటున్నాడు. అయితే మూడు సంవత్సరాల క్రితం వారు దాచుకున్న 50వేల రూపాయాలను అప్పుగా తీసుకున్నాడు హోటల్ వ్యాపారి నర్సింహారావు. అప్పటి నుంచి వడ్డీ ఇవ్వకపోగా.. మొత్తానికే పంగనామం పెట్టాడు. అప్పు తిరిగి ఇవ్వకుండా మొఖం చాటేశాడు వ్యాపారి నర్సింహారావు. ఇటీవల యాచకుడు అశోక్తో పాటు మొత్తం 69 మందికి ఐపీ నోటీసులు పంపాడు. ఖమ్మంలోని సివిల్ కోర్టులో దివాళా పిటిషన్ దాఖలు చేశాడు. మొత్తం ఒక కోటీ 95లక్షల అప్పు తీసుకొని.. 69మందికి ఐపీ నోటీసులు ఇచ్చాడు. నోటీసులు పొందిన వారిలో యాచకుడు గొళ్లల అశోక్ కూడా ఉండడంతో స్థానికులంతా విస్తుపోతున్నారు.
ఎన్నో ఏళ్లుగా బిచ్చం ఎత్తుకుని.. దాచుకున్న డబ్బును వ్యాపారి నర్సింహారావును నమ్మి ఇస్తే నట్టేట ముంచాడని యాచకుడు అశోక్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తన బిడ్డ చదువు కోసం దాచుకున్న డబ్బును వ్యాపారికి అప్పుగా ఇచ్చానని.. తనకు న్యాయం చేయాలంటూ వేడుకొంటున్నాడు యాచకుడు అశోక్. బిచ్చగాడినే ముంచేసిన నర్సింహారావు వ్యవహారం ఇప్పుడు స్థానికంగా చర్చనీయాంశమైంది
Also read
- పిల్లలను కారులో ఉంచి లాక్ చేయడంతో…కొంచమైతే ఎంతఘోరం జరిగేది?
- పోలీసోళ్లను పిచ్చోళ్లను చేసింది.. MMTSలో అత్యాచారయత్నం కేసులో బిగ్ ట్విస్ట్ !
- తిరుపతి అక్టోపస్ పోలీస్ కానిస్టేబుల్ దారుణ హత్య..మర్డర్ వెనుక సంచలన విషయాలు
- నేటి జాతకములు..19 ఏప్రిల్, 2025
- Texas: నెల రోజుల్లో ఇంటికి రావాల్సుంది..అంతలోనే తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయింది!