చిత్తూరు జిల్లా పాలసముద్రం మండలంలోని నరసింహాపురం ఎంపీటీసీ సభ్యుడు జగన్నాథరాజు కిడ్నాపర్ల చెరలో గుండెపోటుతో మృతి చెందారు
పాలసముద్రం: చిత్తూరు జిల్లా పాలసముద్రం మండలంలోని నరసింహాపురం ఎంపీటీసీ సభ్యుడు జగన్నాథరాజు కిడ్నాపర్ల చెరలో గుండెపోటుతో మృతి చెందారు. విజయవాడకు చెందిన ఓ ప్రైవేటు ఫైనాన్స్ సంస్థ ద్వారా వాయిదాల పద్ధతిలో జేసీబీ కొనుగోలు చేశాడు. నెలవారీ వాయిదాల చెల్లింపులో జాప్యం జరగడంతో రుణ సంస్థ నుంచి బెదిరింపులు ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో మంగళవారం గంగాధర నెల్లూరు మండలంలో సొంత పనుల్లోఉన్న జగన్నాథరాజును రుణ సంస్థ ప్రతినిధులు అపహరించారు. విజయవాడకు వాహనంలో తీసుకెళ్తుండగా గుండెపోటుకు గురై మృతి చెందాడు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు రుణ సంస్థ ప్రతినిధులపై కిడ్నాప్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also read
- దీపావళి ఏ రోజు జరుపుకోవాలో తెలుసా? పండితులు ఇచ్చిన క్లారిటీ ఇదే!
- Hyderabad : రేవ్ పార్టీ భగ్నం.. పోలీసుల అదుపులో 72 మంది ఫెర్టిలైజర్ డీలర్లు
- AP Crime: గుంటూరులో ఘోరం.. రన్నింగ్ ట్రైన్లో మహిళను రే**ప్ చేసి.. ఆపై డబ్బులు, నగలతో..
- HOME GUARD ABORT : ప్రేమ పేరుతో మోసం చేసిన హోంగార్డు..అబార్షన్ వికటించి యువతి మృతి
- Bengaluru : భార్యను స్మూత్ గా చంపేసిన డాక్టర్.. ఆరు నెలల తరువాత బిగ్ ట్విస్ట్!