చిత్తూరు జిల్లా పాలసముద్రం మండలంలోని నరసింహాపురం ఎంపీటీసీ సభ్యుడు జగన్నాథరాజు కిడ్నాపర్ల చెరలో గుండెపోటుతో మృతి చెందారు
పాలసముద్రం: చిత్తూరు జిల్లా పాలసముద్రం మండలంలోని నరసింహాపురం ఎంపీటీసీ సభ్యుడు జగన్నాథరాజు కిడ్నాపర్ల చెరలో గుండెపోటుతో మృతి చెందారు. విజయవాడకు చెందిన ఓ ప్రైవేటు ఫైనాన్స్ సంస్థ ద్వారా వాయిదాల పద్ధతిలో జేసీబీ కొనుగోలు చేశాడు. నెలవారీ వాయిదాల చెల్లింపులో జాప్యం జరగడంతో రుణ సంస్థ నుంచి బెదిరింపులు ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో మంగళవారం గంగాధర నెల్లూరు మండలంలో సొంత పనుల్లోఉన్న జగన్నాథరాజును రుణ సంస్థ ప్రతినిధులు అపహరించారు. విజయవాడకు వాహనంలో తీసుకెళ్తుండగా గుండెపోటుకు గురై మృతి చెందాడు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు రుణ సంస్థ ప్రతినిధులపై కిడ్నాప్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also read
- Garuda Puran: దహన సంస్కారాల తర్వాత స్మశానం నుంచి వస్తూ తిరిగి చూడడం అశుభం.. ఎందుకంటే
- Hindu Beliefs: రాత్రి గుడ్లగూబని చూడడం మంచిదేనా.. ఎటువంటి పక్షి కనిపిస్తే ఏ ఫలితం అంటే..
- Weekly Horoscope: గతం కంటే మెరుగ్గా వారి ఆర్థిక పరిస్థితి.. 12 రాశుల వారికి వారఫలాలు
- అయ్యో.. ఆసుపత్రిలో ఘోరం.. పసికందుపై ఊడిపడిన సీలింగ్ ఫ్యాన్.. ఆ తర్వాత..
- ఆ ఇళ్లే వారి టార్గెట్.. ఒకే రోజు రెండు చోరీలు.. వణికిపోతున్న స్థానికులు.. ఎక్కడో తెలుసా?