మద్యం మత్తులో తన భార్యను చంపేశాడో భర్త. ఈ ఘటన విజయవాడ టూ టౌన్ కొత్తపేట పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
ఈ ఘటన విజయవాడ టూ టౌన్ కొత్తపేట పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. షేక్ నగీనా అనే మహిళ తన భర్త బాజీతో కలిసి కంసాలిపేటలో నివాసం ఉంటోంది. బాజీ పెయింటర్.. నగీనా(32) ఓ సమోసాల తయారీ కేంద్రంలో కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. బాజీ మద్యానికి బానిసై రోజూ భార్యతో గొడవపడేవాడు. ఇవాళ మద్యం మత్తులో ఆమెతో వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలోనే కత్తితో నగీనా గొంతు కోసి చంపేశాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. బాజీని అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు
Also read
- నేటి జాతకములు 31 జూలై, 2026
- అసంఘటిత కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చెయ్యాలి….పామర్తి సత్యనారాయణ, ఐ.యఫ్.టి.యు .
- ఇంకా దొరకని బాలయ్య ఆచూకీ!
- Shukra Gochar 2026: శుక్రుడి అనుగ్రహం..ఆర్థికంగా ఈ రాశుల వారికి గోల్డెన్ డేస్..!
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?





