తిరుమలలో వైకాపా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్తో కలిసి మాధురి హల్చల్ చేశారు.

తిరుమల: వైకాపా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్తో కలిసి మాధురి తిరుమలలో హల్చల్ చేశారు. శ్రీవారి ఆలయం, పుష్కరిణి వద్ద ఫొటోలు, వీడియోలు తీసుకుంటూ హంగామా సృష్టించారు. సోమవారం ఉదయం దువ్వాడ శ్రీనివాస్, మాధురి శ్రీవారి దర్శనానికి వచ్చారు. ఈ సందర్భంగా మాధురి.. తమ సహాయకులతో కలిసి శ్రీవారి ఆలయం, పుష్కరిణి, మాడవీధుల్లో వీడియోలు, ఫొటోలు తీసుకుంటూ గడిపారు. ఆధ్యాత్మిక ప్రాంతమైన తిరుమలలో వారు వ్యవహరించిన తీరుపై పలువురు భక్తులు విస్మయం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా మాధురి మీడియాతో మాట్లాడుతూ.. “దువ్వాడ శ్రీనివాస్ను త్వరలోనే వివాహం చేసుకుంటాను. వారి సతీమణి విడాకుల వ్యవహారం న్యాయస్థానం పరిధిలో ఉన్నందున ప్రస్తుతానికి సహజీవనం చేస్తున్నాను. విడాకులు రాగానే అధికారికంగా వివాహం చేసుకుంటాం” అని తెలిపారు.
Also read
- ప్రతిరోజూ పెళ్లి చేసుకొనే స్వామిని సందర్శిస్తే మీకు కూడా వివాహం
- Telangana: ఇదెక్కడి యవ్వారం.. గాజుల పండక్కి పిలవలేదని.. ఏకంగా కోర్టుకెళ్లిన మహిళ.. ఎక్కడంటే?
- Andhra: పెట్రోల్ కొట్టించేందుకు బంక్కొచ్చిన కానిస్టేబుల్.. ఆపై కాసేపటికే తోపునంటూ..
- Fake DSP: ఉద్యోగాల పేరుతో యువకులకు ఎరా.. తీగలాగితే కదులుతున్న నకిలీ డీఎస్పీ దందా!
- Tuni: తండ్రి మరణంపై నారాయణరావు కుమారుడు రియాక్షన్ వైరల్.. అనూహ్య రీతిలో





