తిరుమలలో వైకాపా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్తో కలిసి మాధురి హల్చల్ చేశారు.

తిరుమల: వైకాపా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్తో కలిసి మాధురి తిరుమలలో హల్చల్ చేశారు. శ్రీవారి ఆలయం, పుష్కరిణి వద్ద ఫొటోలు, వీడియోలు తీసుకుంటూ హంగామా సృష్టించారు. సోమవారం ఉదయం దువ్వాడ శ్రీనివాస్, మాధురి శ్రీవారి దర్శనానికి వచ్చారు. ఈ సందర్భంగా మాధురి.. తమ సహాయకులతో కలిసి శ్రీవారి ఆలయం, పుష్కరిణి, మాడవీధుల్లో వీడియోలు, ఫొటోలు తీసుకుంటూ గడిపారు. ఆధ్యాత్మిక ప్రాంతమైన తిరుమలలో వారు వ్యవహరించిన తీరుపై పలువురు భక్తులు విస్మయం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా మాధురి మీడియాతో మాట్లాడుతూ.. “దువ్వాడ శ్రీనివాస్ను త్వరలోనే వివాహం చేసుకుంటాను. వారి సతీమణి విడాకుల వ్యవహారం న్యాయస్థానం పరిధిలో ఉన్నందున ప్రస్తుతానికి సహజీవనం చేస్తున్నాను. విడాకులు రాగానే అధికారికంగా వివాహం చేసుకుంటాం” అని తెలిపారు.
Also read
- నేటి జాతకం లు 14 జూన్, 2026
- కలికాలం.. ఇలాంటి ఫ్రెండ్స్తో జాగ్రత్త.. అప్పు ఇవ్వలేదని వెంచర్కు తీసుకెళ్లి..
- మీరేం మనుషులురా.. రూ.20 కోసం చిల్లర గొడవ.. కాపాడడానికి వెళ్తే కొట్టి చంపేశారు..
- ATM: ఎంతకు తెగించార్రా..? ఏటీఎం మెషిన్ ఎత్తుకెళ్లేందుకు యత్నం.. బెడిసికొట్టిన ప్లాన్..!
- దొంగను పట్టించిన చెప్పులు.. రెండు నెలల తర్వాత దొరికిన అసలైన క్లూ!





