తిరుమలలో వైకాపా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్తో కలిసి మాధురి హల్చల్ చేశారు.
తిరుమల: వైకాపా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్తో కలిసి మాధురి తిరుమలలో హల్చల్ చేశారు. శ్రీవారి ఆలయం, పుష్కరిణి వద్ద ఫొటోలు, వీడియోలు తీసుకుంటూ హంగామా సృష్టించారు. సోమవారం ఉదయం దువ్వాడ శ్రీనివాస్, మాధురి శ్రీవారి దర్శనానికి వచ్చారు. ఈ సందర్భంగా మాధురి.. తమ సహాయకులతో కలిసి శ్రీవారి ఆలయం, పుష్కరిణి, మాడవీధుల్లో వీడియోలు, ఫొటోలు తీసుకుంటూ గడిపారు. ఆధ్యాత్మిక ప్రాంతమైన తిరుమలలో వారు వ్యవహరించిన తీరుపై పలువురు భక్తులు విస్మయం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా మాధురి మీడియాతో మాట్లాడుతూ.. “దువ్వాడ శ్రీనివాస్ను త్వరలోనే వివాహం చేసుకుంటాను. వారి సతీమణి విడాకుల వ్యవహారం న్యాయస్థానం పరిధిలో ఉన్నందున ప్రస్తుతానికి సహజీవనం చేస్తున్నాను. విడాకులు రాగానే అధికారికంగా వివాహం చేసుకుంటాం” అని తెలిపారు.
Also read
- నేటి జాతకములు..17 అక్టోబర్, 2024
- Nandivardhanam: ఈ నందివర్థనం పూలతో ఉండే బెనిఫిట్స్ ఊహించనవి.. షాక్ అవ్వక తప్పదు..
- 16వ శతాబ్దం నాటిఆంజనేయస్వామి ఆలయం ధ్వంసం.. సీఎం చంద్రబాబు సీరియస్
- ఆశ్వీయుజ పౌర్ణమి శ్రీ వాల్మీకి జయంతి…..!(17.10.24)
- Visakha Honey Trap Case: పెళ్లైన మగాళ్లే టార్గెట్.. తియ్యటి మాటలతో జ్యూస్ ఇస్తది.. తాగారంటే పని ఖతమే..