ఒంగోలు::
దేవీశరన్నవరాత్రులలో త్రిశక్తుల ఆరాధన ఙ్ఞానవైరాగాలను కలిగిస్తుందని ప్రముఖ ఆధ్యాత్మిక ఉపన్యాసకులు, ప్రకాశంజిల్లా రచయితల సంఘం అధ్యక్షులు పొన్నూరు వేంకట శ్రీనివాసులు అన్నారు. కేశవస్వామిపేటలో లలితాశ్రమంలో జరుగుతున్న దేవీశరన్నవరాత్రి మహోత్సవాల్లో ఆయన త్రిశక్తుల వైభవంపై ప్రసంగించారు. మహాసరస్వతి వాక్కుని, మహాలక్ష్మి ఐశ్వర్యాన్ని , మహాదుర్గ శక్తిని ప్రసాదిస్తుందన్నారు. ఉపసన్యాసకులు పొన్నూరు వేంకట శ్రీనివాసులుని లలితాశ్రమం మాతాజీ విఙ్ఞానంద సరస్వతి అమ్మవారి శేషవస్త్రంతో సత్కరించారు. కార్యక్రమంలో స్వయంపాకుల కోటేశ్వరశర్మ, అగస్త్యరాజు శివయ్య, నాదెండ్ల జ్వాలా ఉమామహేశ్వర శర్మ, ఒ.ప్రసాద్, గుర్రం కష్ణ, చిలకపాటి రంగారావు తదితరులు పాల్గొన్నారు.

Also read
- Palnadu: భార్యపై అనుమానంతో భర్త ఘాతుకం.. ఏం చేశాడో తెలుస్తే షాక్!
- AP Crime: ఏపీలో దోపిడి దొంగల బీభత్సం.. పట్టపగలే ఇళ్లలోకి దూరి!
- అప్పు ఇచ్చిన వ్యక్తితో అక్రమ సంబంధం.. మొక్కజొన్న చేను దగ్గర సైలెంట్గా లేపేసింది!
- వరూధుని ఏకాదశి రోజున తులసితో ఈ పరిహారాలు చేయండి.. పెండింగ్ పనులు పూర్తి అవుతాయి..
- Swapna Shastra: కలలో ఈ మూడు పక్షులు కనిపిస్తే మీకు మంచి రోజులు వచ్చాయని అర్ధమట..