ఒంగోలు::
దేవీశరన్నవరాత్రులలో త్రిశక్తుల ఆరాధన  ఙ్ఞానవైరాగాలను కలిగిస్తుందని ప్రముఖ ఆధ్యాత్మిక ఉపన్యాసకులు, ప్రకాశంజిల్లా  రచయితల సంఘం అధ్యక్షులు పొన్నూరు వేంకట శ్రీనివాసులు అన్నారు. కేశవస్వామిపేటలో లలితాశ్రమంలో జరుగుతున్న దేవీశరన్నవరాత్రి మహోత్సవాల్లో ఆయన త్రిశక్తుల వైభవంపై ప్రసంగించారు. మహాసరస్వతి వాక్కుని, మహాలక్ష్మి ఐశ్వర్యాన్ని , మహాదుర్గ శక్తిని ప్రసాదిస్తుందన్నారు. ఉపసన్యాసకులు పొన్నూరు వేంకట శ్రీనివాసులుని లలితాశ్రమం మాతాజీ విఙ్ఞానంద సరస్వతి అమ్మవారి శేషవస్త్రంతో సత్కరించారు. కార్యక్రమంలో స్వయంపాకుల కోటేశ్వరశర్మ, అగస్త్యరాజు శివయ్య, నాదెండ్ల జ్వాలా ఉమామహేశ్వర శర్మ, ఒ.ప్రసాద్, గుర్రం కష్ణ, చిలకపాటి రంగారావు తదితరులు పాల్గొన్నారు.

Also read
- అప్పు కోసం పిన్నింటికి వచ్చిన వ్యక్తి.. భార్యతో కలిసి ఏం చేసాడో తెలుసా..?
 - Telangana: కనిపెంచిన కొడుకును కడతేర్చిన తండ్రి.. కారణం తెలిస్తే షాకే
 - Andhra: అమ్మతో కలిసి కార్తీకదీపం వెలిగించాలనుకుంది.. తీరా చూస్తే కాసేపటికే..
 - Telangana: ఆదివారం సెలవు కదా అని బంధువుల ఇంటికి బయల్దేరారు.. కొంచెం దూరం వెళ్లగానే
 - Telangana: బెట్టింగ్ యాప్కు కానిస్టేబుల్ బలి..! పోలీస్ స్టేషన్లోని పిస్టల్ తీసుకొని అకస్మాత్తుగా..
 





