గుంటూరులోని ఫిరంగిపురంలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. సవతి తల్లి లక్ష్మి ఆరేళ్ళ కుమారుడిని గోడకేసి కొట్టి చంపింది. సాగర్ అనే వ్యక్తి మొదటి భార్య చనిపోవడంతో లక్ష్మిని రెండవ వివాహం చేసుకున్నారు. మొదటి భార్య పిల్లలు అనే కోపంతో లక్ష్మీ వారిని తరచూ హింసిస్తూ ఉండేది
AP News: పసిగుడ్డు అని కూడా చూడకుండా దారుణానికి ఒడిగట్టింది సవతితల్లి. మొదటి భార్య పిల్లలు అనే కోపంతో చిత్రహింసలకు గురిచేసింది. అతి కర్కశంగా ఆరేళ్ళ కుమారుడిని గోడకేసి కొట్టి చంపింది. ఈ అమానవీయ ఘటన గుంటూరులోని ఫిరంగిపురం గ్రామంలో చోటుచేసుకుంది
గోడకేసి కొట్టి
సాగర్ అనే వ్యక్తికి గతంలో పెళ్ళై.. ఇద్దరు కవల పిల్లలు ఉన్నారు. అయితే మొదటి భార్య చనిపోవడంతో సాగర్ ఫిరంగిపురానికి చెందిన లక్ష్మిని రెండవ వివాహం చేసుకున్నాడు. లక్ష్మీ సాగర్ కి భార్య అయ్యింది.. కానీ అతడి పిల్లలకు మాత్రం తల్లి కాలేకపోయింది. మొదటి భార్య పిల్లలు అనే కోపంతో ఆ ఇద్దరినీ తరచూ చిత్రహింసలకు గురిచేసేది. ఈ క్రమంలో ఆదివారం చిన్న కుమారుడు కార్తీక్ ని(6) దారుణంగా హింసిస్తూ గోడకేసి కొట్టింది. దీంతో ఆ బాలుడి తల పగిలి చనిపోయాడు. అంతేకాదు పెద్దకుమారుడు ఆకాష్ కి రక్తం వచ్చేలా వాతలు పెట్టింది. కార్తీక మరణంతో సవతితల్లి అకృత్యాలు వెలుగులోకి వచ్చాయి.
Also read
- మధ్యాహ్న భోజన పథకం కార్మికుల పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి….. గ్రీష్మ కుమార్, ఐ.యఫ్టియు రాష్ట్ర కమిటీ సభ్యులు.
- Ganesh Chaturthi: గణేశుడికి ఏనుగు తల ఎలా వచ్చింది? గజాసురుడి తలనే ఎందుకు పెట్టారు.. అసలు కథ ఇదే!
- భాద్రపద మాసం.. వినాయక చవితి నుంచి మహాలయ అమావాస్య వరకు.. ఈ మాసంలోని పండగలివే!
- వినాయక చవితి వేళ అద్భుత గ్రహ యోగాలు.. ఈ రాశుల వారికి గణపతి ఆశీస్సులతో పట్టిందల్లా బంగారమే!
- వరాహ జయంతి సెప్టెంబర్ 13నా.. 14నా? తేదీ, శుభ సమయం, పూజా విధానం ఇదే!





