ప్రభుత్వ పథకాల విషయంలో వివాదం తలెత్తి కన్నతల్లిని కుమారుడు ఇనుప పైపుతో కొట్టి హతమార్చిన దారుణ సంఘటన జనగామ జిల్లా స్టేషనఘన్పూర్ మండలం నమిలిగొండ గ్రామంలో చోటుచేసుకొంది.
స్టేషన్ ఘన్పూర్ , : ప్రభుత్వ పథకాల విషయంలో వివాదం తలెత్తి కన్నతల్లిని కుమారుడు ఇనుప పైపుతో కొట్టి హతమార్చిన దారుణ సంఘటన జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్ మండలం నమిలిగొండ గ్రామంలో చోటుచేసుకొంది. గ్రామస్థులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన సముద్రాల లచ్చమ్మ(65) చిన్న కుమారుడు సముద్రాల సత్తయ్య కాజీపేటలో అద్దె నివాసంలో ఉంటున్నాడు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివిధ ఉచిత పథకాలను రేషన్కార్డు సాయంతో పొందుతున్నాడు. ఉమ్మడిగా ఉన్న రేషన్కార్డు తీసుకెళ్లి నువ్వు ఒక్కడివే పథకాలు ఎలా పొందుతావని శుక్రవారం అర్ధరాత్రి తల్లి ప్రశ్నించడంతో ఇద్దరి మధ్య వివాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో గతంలోనూ తనకు రోడ్డు ప్రమాదం జరిగిన సమయంలో భూమిని విక్రయించగా వచ్చిన డబ్బులు సరిగా ఇవ్వలేదని క్షణికావేశానికి లోనైన సత్తయ్య తల్లిని ఇనుప పైపుతో కొట్టడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందారు. పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండుకు తరలించారు.
Also read
- Weekly Horoscope: ఆర్థిక వ్యవహారాల్లో వారికి అనుకూలత.. 12 రాశుల వారికి వారఫలాలు
- Andhra Pradesh: ఇలా ఉన్నారేంట్రా.. గోల్డ్ షాపు ఓనర్ కళ్లలో కారం కొట్టి ఇతడు ఏం చేశాడో చూడండి..
- Ugadi 2026: పరాభవ నామ సంవత్సరం అర్థం ఏమిటి..? మనకు ఇచ్చే రహస్య సందేశం ఏంటో తెలుసా..?
- టార్గెట్ ఒకరు.. ప్రాణం పోయింది మరొకరిది.. బట్టల తీగకు కరెంట్ షాక్ పెట్టి హత్య
- దేవాయంలో ప్రదక్షిణలు ఎందుకు చేస్తారు..? ఏ దేవుడికి ఎన్ని ప్రదక్షిణలు చేయాలో తెలుసా..?





