ప్రభుత్వ పథకాల విషయంలో వివాదం తలెత్తి కన్నతల్లిని కుమారుడు ఇనుప పైపుతో కొట్టి హతమార్చిన దారుణ సంఘటన జనగామ జిల్లా స్టేషనఘన్పూర్ మండలం నమిలిగొండ గ్రామంలో చోటుచేసుకొంది.
స్టేషన్ ఘన్పూర్ , : ప్రభుత్వ పథకాల విషయంలో వివాదం తలెత్తి కన్నతల్లిని కుమారుడు ఇనుప పైపుతో కొట్టి హతమార్చిన దారుణ సంఘటన జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్ మండలం నమిలిగొండ గ్రామంలో చోటుచేసుకొంది. గ్రామస్థులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన సముద్రాల లచ్చమ్మ(65) చిన్న కుమారుడు సముద్రాల సత్తయ్య కాజీపేటలో అద్దె నివాసంలో ఉంటున్నాడు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివిధ ఉచిత పథకాలను రేషన్కార్డు సాయంతో పొందుతున్నాడు. ఉమ్మడిగా ఉన్న రేషన్కార్డు తీసుకెళ్లి నువ్వు ఒక్కడివే పథకాలు ఎలా పొందుతావని శుక్రవారం అర్ధరాత్రి తల్లి ప్రశ్నించడంతో ఇద్దరి మధ్య వివాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో గతంలోనూ తనకు రోడ్డు ప్రమాదం జరిగిన సమయంలో భూమిని విక్రయించగా వచ్చిన డబ్బులు సరిగా ఇవ్వలేదని క్షణికావేశానికి లోనైన సత్తయ్య తల్లిని ఇనుప పైపుతో కొట్టడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందారు. పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండుకు తరలించారు.
Also read
- Telangana: హైదరాబాద్లో కాల్పుల కలకలం.. గన్తో ఏపీ మాజీ డిప్యూటీ సీఎం తమ్ముడు..
- Watch Video: సర్కార్ బడి టీచరమ్మ వేషాలు చూశారా? బాలికలతో కాళ్లు నొక్కించుకుంటూ ఫోన్లో బాతాఖానీ! వీడియో
- ప్రైవేటు స్కూల్ బాలికపై అర్ధరాత్రి లైంగికదాడి!
- నేటి జాతకములు…5 నవంబర్, 2025
- అప్పు కోసం పిన్నింటికి వచ్చిన వ్యక్తి.. భార్యతో కలిసి ఏం చేసాడో తెలుసా..?





